Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సంగీత ప్రియులను మాయ చేస్తున్న బ్లఫ్ మాస్టర్ పాట.. మరోసారి సునీత..
ఆశ, అత్యాశల నేపథ్యంతో రూపొందిన చతురంగ వేట్టై చిత్రానికి తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడీ చిత్రం తెలుగులో రీమేక్ అయ్యింది . అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లై ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వం వహిస్తున్నారు. జ్యోతిలక్ష్మి, ఘాజి చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా, ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నందితా శ్వేత ఇందులో నాయికగా కనిపించనున్నారు.
బ్లఫ్ మాస్టర్ చిత్రానికి సంబంధించిన వీడియో సాంగ్ను చిత్ర యూనిట్ మంగళవారం రిలీజ్ చేశారు. ఏ మాయో ఏమో తెలియదే.. తెలిసేదేలా మనసుకు. అడిగా తొలిగా.. నన్నే ఎవరని.. సాగే పాటకు విశ్వనాథ్ కారసాల పాడగా, గాయని సునీత ఆ గేయానికి జీవం పోశారు. గులాబి చిత్రంలోని ఈ వేళలో నువ్వు అనే పాటను గుర్తు తెచ్చేంతగా గేయాన్ని ఆలపించారు. అద్భుతమైన సాహిత్యంతో ఏ మాయో పాట వినసొంపుగా.. వినగానే ఆకట్టుకొనేలా ఉంది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.
అభిషేక్ ఫిల్మ్స్ బ్యానర్పై రూపొందే ఈ చిత్రానికి నిర్మాత రమేష్ పీ పిళ్లై. ప్రముఖ నిర్మాణ సంస్థ, సమ్మోహనం లాంటి సినిమాను అందించిన శ్రీదేవీ మూవీస్ బ్యానర్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.