Don't Miss!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
సంగీత ప్రియులను మాయ చేస్తున్న బ్లఫ్ మాస్టర్ పాట.. మరోసారి సునీత..
ఆశ, అత్యాశల నేపథ్యంతో రూపొందిన చతురంగ వేట్టై చిత్రానికి తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడీ చిత్రం తెలుగులో రీమేక్ అయ్యింది . అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లై ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వం వహిస్తున్నారు. జ్యోతిలక్ష్మి, ఘాజి చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా, ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నందితా శ్వేత ఇందులో నాయికగా కనిపించనున్నారు.
బ్లఫ్ మాస్టర్ చిత్రానికి సంబంధించిన వీడియో సాంగ్ను చిత్ర యూనిట్ మంగళవారం రిలీజ్ చేశారు. ఏ మాయో ఏమో తెలియదే.. తెలిసేదేలా మనసుకు. అడిగా తొలిగా.. నన్నే ఎవరని.. సాగే పాటకు విశ్వనాథ్ కారసాల పాడగా, గాయని సునీత ఆ గేయానికి జీవం పోశారు. గులాబి చిత్రంలోని ఈ వేళలో నువ్వు అనే పాటను గుర్తు తెచ్చేంతగా గేయాన్ని ఆలపించారు. అద్భుతమైన సాహిత్యంతో ఏ మాయో పాట వినసొంపుగా.. వినగానే ఆకట్టుకొనేలా ఉంది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.
అభిషేక్ ఫిల్మ్స్ బ్యానర్పై రూపొందే ఈ చిత్రానికి నిర్మాత రమేష్ పీ పిళ్లై. ప్రముఖ నిర్మాణ సంస్థ, సమ్మోహనం లాంటి సినిమాను అందించిన శ్రీదేవీ మూవీస్ బ్యానర్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.