Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
పాయల్ ఘోష్పై లైంగికదాడి: అనురాగ్ కశ్యప్కు ముంబై పోలీసుల సమన్లు
బాలీవుడ్ హీరోయిన్ పాయల్ ఘోష్పై లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు అనురాగ్ కశ్యప్కు ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్ అధికారులు సమన్లు జారీ చేశారు. కొద్ది రోజుల క్రితం తెలుగు టెలివిజన్ ఛానెల్ ఏబీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారు అని పాయల్ ఘోష్ వెల్లడించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ వ్యవహారంలో గతవారం వెర్సోవా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అయితే ఫిర్యాదు చేసిన అనురాగ్ కశ్యప్ను విచారించకుండా తనను పోలీసులు వేధిస్తున్నారని పాయల్ ఘోష్ సోమవారం మీడియాకు తెలిపారు. అలాగే వైద్య పరీక్షల పేరుతో తన క్లయింట్ను వెర్సోవా పోలీసులు వేధిస్తున్నారని పాయల్ ఘోష్ లాయర్ కూడా వెల్లడించారు.
అనురాగ్ కశ్యప్కు పోలీసులు అండగా నిలుస్తున్నారు. తన పిటిషన్కు స్పందించడం లేదని మంగళవారం పాయల్ ఘోష్ మహారాష్ట్ర గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ముంబై పోలీసులు అనురాగ్ కశ్యప్కు సమన్లు జారీ చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, పాయల్ ఘోష్కు న్యాయం చేయాలంటూ పలువురు బాలీవుడ్, సినీ, రాజకీయ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. అదే విధంగా అనురాగ్ కశ్యప్కు అండగా పలువరు సినీ తారలు కూడా నిలవడం తెలిసిందే.