Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రియా చక్రవర్తి ఫినిష్.. బాలీవుడ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.. మూవీ నుంచి తప్పిస్తూ..
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో హీరోయిన్ రియా చక్రవర్తి కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. రియా చక్రవర్తితో ఇప్పటికే సినిమాలు తీయడానికి ఒప్పందం కుదుర్కొన్న నిర్మాతలు వెనకడుగు వేస్తూ నిర్ణయం తీసుకొన్నారు. తాజాగా బాలీవుడ్లో వర్ధమాన దర్శకుడు లోమ్ హర్ష్ స్పందిస్తూ..
సుశాంత్ మరణం తర్వాత
బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తికి ఆఫర్ను రిజెక్ట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై దర్శకుడు లోమ్ హార్ష్ స్పందిస్తూ.. తన చిత్రంలో రియాను తీసుకోవద్దని నిర్ణయం తీసుకొన్నాను. సుశాంత్ మరణం తర్వాత సినీ ప్రేక్షకుల మనోభావాలు దెబ్బ తిన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రియాను తీసుకోవడం కత్తి మీద సామే అంటూ వ్యాఖ్యానించారు.
మా సినిమాలో ఆఫర్
నా కెరీర్లో రెండో సినిమాను ప్రారంభించబోతున్నాను. రియా చక్రవర్తిని హీరోయిన్గా తీసుకోవాలనుకొన్నాను. ఈ సినిమాను 2018 నుంచి ప్లాన్ చేస్తున్నాను. ఈ ఏడాది షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశాం. రియాను నిర్మాతలు, క్యాస్టింగ్ టీమ్ ఎంపిక చేసింది. సుశాంత్ మరణం, ప్రస్తుత పరిస్థితుల తర్వాత మా నిర్ణయం మార్చుకొన్నాం. రియా మా చిత్రంలో ఉండదు అని లోమ్ హార్ష్ స్పష్టం చేశారు.
రియా కెరీర్ ఫినిష్
మేము రూపొందించబోయే చిత్రం వైద్య రంగానికి సంబంధించినది. రియా చక్రవర్తి డాక్టర్ పాత్ర పోషించాల్సింది. హీరోయిన్ ప్రాధాన్యమున్న చిత్రంగా రూపొందించాలనుకొన్నాం. కానీ తాజా పరిస్థితుల ప్రభావంతో మా సినిమా నుంచి రియాను తప్పించాం. ఈ కేసు సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో ఆమె కెరీర్ ఫినిష్ అని దర్శకుడు లోమ్ హార్ష్ పేర్కొన్నారు.
ప్రజా తీర్పును గౌరవించాలి
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం అభిమానులు, దేశ ప్రజల సెంటిమెంట్కు సంబంధించిన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు, కోర్టు తీర్పులను గౌరవించాల్సిన అవసరం ఉంది. సుశాంత్ ఫ్యాన్స్ సెంటిమెంట్ను దెబ్బ తీయలేం. మా సినిమాపై ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నాం అని లోమ్ హర్ష్ తెలిపారు.