Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
చిరంజీవితో బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ప్లాన్.. ఈ మూవీ కూడా అదే రేంజ్లో ఉండేలా.!
రాజకీయాల నుంచి తప్పుకుని పూర్తిగా సినిమాలపై దృష్టి సారిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇందులో భాగంగానే ఆయన 'ఖైదీ నెంబర్ 150' అనే సినిమా ద్వారా టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్లను సైతం అంతే స్థాయిలో రాబట్టడంతో ఆయనలో ఉత్సాహం రెట్టింపు అయింది. దీంతో చిరు వరుసగా సినిమాలు చేయాలని డిసైడ్ అయిపోయారు. ఈ క్రమంలోనే ఇటీవల 'సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీని తర్వాత ఆయన మరో సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తాజాగా దానికి సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా వార్త..? పూర్తి వివరాల్లోకి వెళితే..
నిరాశ పరిచిన భారీ సినిమా
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి'. రామ్ చరణ్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ ఇటీవల విడుదలైంది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ, కలెక్షన్లు మాత్రం అనుకున్న రేంజ్లో రాలేదు. దీంతో నష్టాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది.
ఈ సారి మిస్ కాకూడదని ప్లాన్
తన తండ్రికి అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలనుకుని తీసిన ‘సైరా' అనుకున్న ఫలితాన్ని అందించకపోవడంతో.. రామ్ చరణ్ వెంటనే మరో సినిమా ప్లాన్ చేశాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ మూవీని తెరకెక్కించబోతున్నాడు. మ్యాట్నీ మూవీస్ సంస్థ సహా నిర్మాతగా వ్యవహరించనుంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.
మళ్లీ మెసేజ్తోనే.. మొదటిది మారింది
కొరటాల అంటే మెసేజ్ ఓరియెంటెడ్ మూవీలు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు అలాగే వచ్చాయి. చిరుతో కూడా అదే ప్రయత్నం చేయబోతున్నాడట. దేవాలయ భూముల చుట్టు తిరిగే కథతో ఈ సినిమా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ముందు ఈ మూవీకి ‘గోవింద ఆచార్య' అనే టైటిల్ ప్రకటించారు. కానీ, ఇటీవల ఇది ‘గోవిందా హరి గోవింద' అని మారిందని అన్నారు.
మళ్లీ అదే బాట.. ఈ సారి చిరు వాట
ఈ సినిమాకు కూడా భారీ బడ్జెట్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్తో పాటు మ్యాట్నీ మూవీస్ సంస్థ అందుకు అనుగుణంగానే ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, ఈ సినిమాకు గానూ చిరంజీవి రెమ్యూనరేషన్ కింద కొన్ని ఏరియాల రైట్స్ తీసుకుంటున్నారని, వాటి విలువ రూ. 50 కోట్లు ఉంటుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
చిరుతో బడా నిర్మాణ సంస్థ ప్లాన్
త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించేందుకు బాలీవుడ్కు చెందిన ఓ బడా నిర్మాణ సంస్థ ముందుకు వచ్చిందని తాజాగా ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీన్ని కూడా తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో రూపొందించాలని వాళ్లు ప్లాన్ చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.