Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
నందమూరి ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్: బాలయ్య - బోయపాటి సినిమాకు కొత్త సమస్య.!
వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. గత ఏడాది ఆయన నుంచి వచ్చిన మూడు సినిమాలూ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. దీంతో నందమూరి ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. ఇలాంటి సమయంలో తనకు రెండు భారీ విజయాలను అందించిన బోయపాటి శ్రీనుతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇలాంటి సమయంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్.? వివరాల్లోకి వెళితే...
ఏమాత్రం ఎఫెక్ట్ చూపించలేదు
గత ఏడాది ప్రారంభంలో నందమూరి బాలకృష్ణ తన తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన రెండు భాగాల్లో నటించారు. ఈ రెండూ భారీ పరాజయాలను మూటగట్టుకున్నాయి. ఇక, ఇటీవల వచ్చిన ‘రూలర్' కూడా ఏమాత్రం ఎఫెక్ట్ చూపించలేదు. ఫలితంగా బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. కేఎస్ రవికుమార్ తెరకెక్కించిన ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలనే మిగిల్చింది.
హ్యాట్రిక్ చేయడానికి కలిశారు
గతంలో ‘సింహా', ‘లెజెండ్' వంటి సూపర్ హిట్లను అందించిన బోయపాటి శ్రీనుకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వాస్తవానికి ఈ సినిమా ‘రూలర్' కంటే ముందే తెరకెక్కాలి. కానీ, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ కూడా హిట్ అయితే.. బోయపాటి - బాలయ్య కాంబోలో హ్యాట్రిక్ నమోదు అవుతుంది.
వాళ్లందరూ ఇందులో నటిస్తున్నారు
ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇది తరచూ వార్తల్లో నిలుస్తోంది. దీనికి కారణం ఈ సినిమా గురించి ప్రచారం అవుతున్న అంశాలే. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు కీలక పాత్రలు చేస్తున్నారని, రోజా విలన్గా నటిస్తుందని, బుల్లితెర యాంకర్లు రష్మీ, అనసూయ సహా జబర్ధస్త్ టీమ్ ఇందులో నటిస్తుందని ప్రచారాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
నందమూరి ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్
కొద్ది రోజుల్లో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జరుపుకుంటుంది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ వాయిదా పడుతుందట. దీనికి కారణం మొదట అనుకున్న స్క్రిప్టులో కొన్ని మార్పులు చేస్తుండడమే అని సమాచారం. బాలయ్య సూచన మేరకు బోయపాటి ఈ నిర్ణయం తీసుకున్నాడని టాక్.
ఆ ప్రభావం భారీగా పడిందంటున్నారు
ఈ సినిమా కథలో ఉన్నట్లుండి మార్పులు చేయడానికి కారణం ‘రూలర్' సినిమా ప్రభావమేననే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్కు అనుగుణంగానే ఇందులో మార్పులు చేస్తున్నారని అంటున్నారు. రొటీన్గా అనిపించే అంశాలను కూడా తీసేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.