Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
దిశా నిందితుల ఎన్కౌంటర్పై బోయపాటి, రాజశేఖర్ సూపర్ రెస్పాన్స్
దేశవ్యాప్తంగా దిశా నిందితుల ఎన్కౌంటర్ సంచలనం సృష్టించింది. నవంబర్ 27న దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేసి దారుణంగా కాల్చి చంపారు. హృదయ విషాదకరమైన ఈ ఘటన యావత్ భారత ప్రజలను కోపోద్రిక్తులను చేసింది. ఈ నేపథ్యంలో దిశా నిందితులను అంతకంటే దారుణంగా చంపేయాలని డిమాండ్లు వచ్చాయి.
ఈ పరిస్థితుల నడుమ దిశా నిందితులపై ఎన్కౌంటర్ జరిగింది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించడంతో నేటి (డిసెంబర్ 6) తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య నిందితులను ఎన్కౌంటర్ చేశారు షాద్ నగర్ పోలీసులు. దీంతో పోలీసుల పని తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
తాజాగా దిశా నిందితుల ఎన్కౌంటర్పై డైరెక్టర్ బోయపాటి శ్రీను స్పందిస్తూ.. ''పొల్యూషన్ నుంచి తప్పించుకోవచ్చు...కానీ పోలీస్ నుంచి తప్పించుకోలేరు'' అంటూ తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. ఇక ఇదే అంశంపై హీరో రాజశేఖర్ రియాక్ట్ అవుతూ.. సజ్జనార్గారూ.. మీకు హాట్సాఫ్ అని తెలిపారు. ''న్యాయం జరిగింది. మన ముఖ్యమంత్రికి థాంక్స్ అలాగే మన పోలీస్, సజ్జనార్ గారికి హాట్సాఫ్. నీ ఆత్మకు శాంతి చేకూరాలి దిశ'' అని రాజశేఖర్ ట్వీట్ చేశారు.
సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితులను నేటి తెల్లవారుజామున పోలీసులు చటాన్పల్లికి తీసుకెళ్లారు. ఘటనా ప్రదేశానికి వెళ్లగానే నలుగురు నిందితులూ.. ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు.