twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై బోయపాటి, రాజశేఖర్ సూపర్ రెస్పాన్స్

    |

    దేశవ్యాప్తంగా దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌ సంచలనం సృష్టించింది. నవంబర్ 27న దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేసి దారుణంగా కాల్చి చంపారు. హృదయ విషాదకరమైన ఈ ఘటన యావత్ భారత ప్రజలను కోపోద్రిక్తులను చేసింది. ఈ నేపథ్యంలో దిశా నిందితులను అంతకంటే దారుణంగా చంపేయాలని డిమాండ్లు వచ్చాయి.

    ఈ పరిస్థితుల నడుమ దిశా నిందితులపై ఎన్‌కౌంటర్‌ జరిగింది. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించడంతో నేటి (డిసెంబర్ 6) తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారు షాద్ నగర్ పోలీసులు. దీంతో పోలీసుల పని తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

     Boyapati Srinu reaction on Disha Encounter

    తాజాగా దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై డైరెక్టర్ బోయపాటి శ్రీను స్పందిస్తూ.. ''పొల్యూషన్ నుంచి తప్పించుకోవచ్చు...కానీ పోలీస్ నుంచి తప్పించుకోలేరు'' అంటూ తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయ్యారు. ఇక ఇదే అంశంపై హీరో రాజశేఖర్ రియాక్ట్ అవుతూ.. సజ్జనార్‌గారూ.. మీకు హాట్సాఫ్ అని తెలిపారు. ''న్యాయం జరిగింది. మన ముఖ్యమంత్రికి థాంక్స్ అలాగే మన పోలీస్, సజ్జనార్ గారికి హాట్సాఫ్. నీ ఆత్మకు శాంతి చేకూరాలి దిశ'' అని రాజశేఖర్ ట్వీట్ చేశారు.

    సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులను నేటి తెల్లవారుజామున పోలీసులు చటాన్‌పల్లికి తీసుకెళ్లారు. ఘటనా ప్రదేశానికి వెళ్లగానే నలుగురు నిందితులూ.. ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు.

    English summary
    The four accused in brutal rape and murder of veterinary doctor Disha have been encountered by Shamshabad police. Tollywood director Boyapati Srinu reacted on this issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X