Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కరోనా క్రైసిస్ చారిటీ: బ్రహ్మాజీ ఆర్థిక సాయం.. చిరంజీవి పిలుపు మేరకు!
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశమంతటా లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో సినిమా షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమై హోమ్ క్వారంటైన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ స్తంభించిపోవడం, సినీ కార్మికుల ఉపాధికి గండి పడటం జరిగాయి.
ఈ విపత్కర పరిస్థితుల్లో అందరికీ అండగా మేమున్నాం అంటూ స్వచ్చందంగా ముందుకొస్తున్నారు పలువురు సినీ ప్రముఖులు. ఇందులో భాగంగా సినిమా రంగాన్ని ఆదుకునేందుకు కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించిన ప్రముఖులు.. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో 'సి.సి.సి. మనకోసం' (కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం) అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సినీ కార్మికులను ఆదుకోవడానికి సినీ నటులు, దర్శకనిర్మాతలు ముందుకు రావాలని కోరారు.
మెగాస్టార్ పిలుపు మేరకు సినీ లోకం కదలి వస్తోంది. సినీ కార్మికులకు అండగా నిలుస్తూ తమ తమ విరాళాలు అందిస్తున్నారు నటీనటులు. తాజాగా తన వంతుగా ఈ సినీ కార్మికుల సహాయ నిధికి రూ. 75000 వితరణ ఇస్తున్నట్లు ప్రకటించాడు నటుడు బ్రహ్మజీ. ఈ కష్ట సమయంలో ఇబ్బంది పడుతున్న సినిమా కార్మికులకు సి.సి.సి ద్వారా టాలీవుడ్ ప్రముఖులు ఆసరాగా నిలుస్తుండటం అభినందనీయం అంటున్నారు జనం.