Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సినీ కార్మికులకు అండగా.. ‘సీసీసీ’కి బ్రహ్మానందం విరాళం
కరోనా వైరస్ ధాటికి ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఈ వైరస్ ధాటికి భారత దేశం కూడా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇప్పటికే ఆరు వేలకు పైగా కరోనా కేసుల నమోదు కాగా.. రెండు వందల మంది వరకు ప్రాణాలను కోల్పోయారు. కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా 21 రోజుల లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 వరకు ఎవ్వరూ కూడా ఇంట్లోంచి బయటకు రాకూడదని సూచించిన విషయం తెలిసిందే.
ఈ నిర్ణయంతో అన్ని కార్యకలాపాలు స్థంభించిపోయాయి. ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. లాక్ డౌన్ వల్ల సినీ పరిశ్రమ మూత పడటంతో రోజూ వారి కూలీలు రోడ్డున పడ్డట్టు అయింది. సినీ శ్రామికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చాడు. కోటి రూపాయల విరాళాన్ని ముందుగా ప్రకటించి.. ఆపై కరోనా క్రైసిస్ ఛారిటీని స్థాపించి తోటీ హీరోలకు కూడా పిలుపునిచ్చాడు. దీంతో విరాళాలు వెల్లువెత్తాయి.
యంగ్ హీరోలంతా కదిలివచ్చారు. అందరూ తమకు తోచిన సాయాన్ని చేశారు. ప్రభాస్, మహేష్ బాబు, దగ్గుబాటి ఫ్యామిలీ, మెగా హీరోలు, యంగ్ హీరోలంతా తమకు తోచినంత ఆర్థిక సాయాన్ని చేసి సినీ కార్మికులకు అండగా నిలబడ్డారు. తాజాగా ఈ సీసీసీకి బ్రహ్మానందం విరాళాన్ని అందించాడు. సినీ శ్రామికులను అండగా ఉండేందుకు మూడు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించాడు.