BRO Pre Release Event పవన్ కల్యాణ్ది ఎంజీఆర్ రేంజ్.. ఖుషీ సమయంలో డేరింగ్ డిసిషన్
ప్రముఖ నిర్మాత.. జనసేన నేత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. మా హీరో పవన్ కల్యాణ్.. మా జనసేన నాయకుడు నటించిన సినిమా బ్రో. భారీ బ్లాక్ బస్టర్ అవుతుంది. మా విరూపాక్ష సినిమా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన సినిమా కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలి అని అన్నారు.
ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ చూస్తే.. ఎంజీఆర్ గుర్తుకు వస్తారు. ఎంజీఆర్ మాదిరిగానే తన సినిమాల్లో సామాజిక సందేశాన్ని ఇస్తారు. పవర్ స్టార్తో ఖుషి సినిమా తీశాను. ఆ సినిమాలో ఓ పాట ఉంటే.. దానిని మార్చి హిందీ పాట పెడుదామని అన్నారు. తెలుగు సినిమాలో హిందీ పాట ఏమిటి? అని అంటారు. కానీ నేను వెంటనే ముంబై నుంచి అబ్బాస్ టైర్ వాలాను పిలిచి ఏ మేరా జాహా అనే పాట రాయించాం. అమ్మాయిలను అక్రమ రవాణా చేయడం, అవినీతి రాజకీయాలపై విమర్శలు సంధించే విధంగా పాట రాశారు. కేవలం పవన్ కల్యాణ్ మాత్రమే ఆ విజన్ ఉంటుంది అని అన్నారు.

అలాగే ఖుషి సినిమాలో క్లైమాక్స్లో రవీంద్రనాథ్ టాగూర్ లాంటి డైలాగ్స్తో సీన్ క్రియేట్ చేశారు. ఆయన సొంతం డైలాగ్స్ రాయడమే కాకుండా ప్రతీ సీన్లో సామాజిక సందేశం ఇవ్వాలని కోరుకొంటారు అని ఏఎం రత్నం అన్నారు.
ఇక ఇదే వేదికపై ప్రసాద్, ఏఎం రత్నంతో కలిసి నిమ్మకాయల ప్రసాద్ మాట్లాడుతూ.. మన టైమ్ వచ్చింది. జూలై 28వ తేదీ తర్వాత కూడా మన టైమ్ ఉంటుంది. ఇక ముందు మన టైమ్ నడుస్తుంది. టైమ్ ఆన్ ది వే అని అన్నారు.


Click it and Unblock the Notifications











