Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Google CEOకి బన్నీ వాసు లేఖ.. ఆ సైకో తప్పా ? మీ తప్పా? ఆలోచించండి!
గత కొద్దిరోజులుగా బన్నీ వాసు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తనను లైంగికంగా వాడుకుని అబార్షన్ కూడా చేయించాడని సునీత అనే ఒక వర్ధమాన నటి ఆరోపిస్తోంది. అయితే ఆమె గతంలో కూడా కత్తి మహేష్ మీద కూడా ఇలాంటి ఆరోపణలు చేసి ఉండడంతో పాటు ఆమె మానసిక స్థితి బాలేదని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ అంశం మీద తాజాగా ఆయన ఏకంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కి లేఖ రాశారు. ఆ వివరాల్లోకి వెళితే
గూగుల్ సీఈఓకి లేఖ
గౌరవనీయులైన సుందర్ పిచ్చయ్ గారికి, అంటూ మొదలు పెట్టిన ఆయన మీరు ఇంటర్నెట్ స్వేచ్ఛ మీద ప్రచురించిన అభిప్రాయాన్ని నేను చదవడం జరిగిందని, గూగుల్ లాంటి అంతర్జాతీయ కంపెనీకి సీఈఓ అయిన మీరు ఎంతో ఆలోచనతో ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉంటారు అని నా నమ్మకం. ఈ విషయం మీద నా స్వీయానుభవం ఒకటి మీతో పంచుకోవటం కోసం ఈ ఉత్తరం రాస్తున్నానని అన్నారు. సామజిక మాధ్యమాలు ఉపయోగించటం మొదలుపెట్టిన రోజుల్లో నేను కూడా నా ఆలోచనా విధానాలు, భావాలూ పంచుకోడానికి ఇది మంచి వేదిక అని నమ్మానని అన్నారు.
నేను పడ్డ క్షోభ
అలాగే భావ ప్రకటనా స్వేచ్ఛకి, ఇంటర్నెట్ స్వేచ్ఛకు అవధులు ఉండకూడదని కచ్చితంగా అనుకున్నాను. ఈ నమ్మకంతోనే సామాజిక మాధ్యమాలను ఆనందంగా ఉపయోగించానని అన్నారు. కానీ గత రెండు సంవత్సరాలుగా బాధ్యతలేని భావ ప్రకటనా స్వేచ్ఛ, ఇంటర్నెట్ స్వేచ్ఛ వలన మానసికంగా నేను పడ్డ క్షోభను మీలాంటి వారికి చెప్పడం వలన సామాజిక మాధ్యమాలలో భావ ప్రకటనా స్వేచ్ఛ, ఇంటర్నెట్ స్వేచ్ఛ మీద మీ ఆలోచన విధానంలో అభ్యుదయ మార్పు వస్తుందని నా నమ్మకం అని రాసుకొచ్చారు.
జగమెరిగిన సత్యం
ఇది ప్రభుత్వాలకో లేదా రాజ్యాలకో లేదా సమాజానికో సంబంధించిన విషయం అయితే వేరు కానీ, ఈ ఇంటర్నెట్ ఫ్రీడం చాటున ఉన్న సామాజిక మాధ్యమాల్లో ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితానికీ, తన కుటుంబ పరువుకు సంబంధించిన విషయం అయితే, ఆ వ్యక్తికీ తన కుటుంబానికి జరిగే నష్టం నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . పైగా ఆ పరువు ఎంతమంది దగ్గర పోయిందో కూడా చక్కటి లెక్కలతో సహా చెబుతారు ఈ వేదిక నిర్వహించే కంపెనీలు అని పేర్కొన్నారు. విచక్షణ లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న వాళ్ళని కట్టడి చేయటానికి సమర్థవంతమైన విధానాలు ఉన్నాయా అంటే మీ దగ్గర సమాధానం ఉండదు అనేది జగమెరిగిన సత్యం అని అన్నారు.
నేను, నా కూతురు
ఇదే కోవలో ఒక విచక్షణ లేని వ్యక్తి వలన ఇబ్బంది పడుతున్న నేను, నా కూతురు, దాని వల్ల నా కుటుంబానికి కలిగిన బాధ చూసిన వాడిగా ఈ ఉత్తరం రాస్తున్నానని ఆయన అన్నారు. అబద్ధాలను అసత్యాలను పోస్టులు, వీడియోల రూపంలో పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్న వాళ్ళది తప్పా ? అలాంటి వాళ్ళు చేస్తున్న క్రూరమైన పనులు నియంత్రించకుండా ప్రపంచం ముందు పెడుతున్న సామాజిక మాధ్యమాలది తప్పా? అని అడిగితే సామాజిక మాధ్యమాల ద్వారా కేవలం ఒక వేదిక అందించటం మాత్రమే మేము చేస్తున్నది అని ఈ వేదికలు తపించుకోవచ్చని అన్నారు,
తల ప్రాణం తోకకు వచ్చింది
ఎంత మంది అమ్మాయిల నగ్న చిత్రాలు ఇంటర్నెట్లో వాళ్ళ ప్రమేయం లేకుండా అప్ లోడ్ చేయబడి వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నాయో రోజూ చూస్తూనే ఉన్నాము. ఎంతోమంది ఆరాచకులు వాళ్ళ వాంఛలు తీర్చకపోతే మార్ఫింగ్ చేసిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో ప్రచురిస్తాం అని బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్న తరుణాలు కోకొల్లలు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో కొంత పలుకుబడి ఉన్న నేను, నా కూతురిని చంపుతానని ఒక మానసిక స్థిమితం లేని సైకో ఒక సామాజిక మాద్యమంలో వీడియో పెడితే, అది తీయించటానికి నా తల ప్రాణం తోకకు వచ్చిందని అన్నారు.
Recommended Video
సామాన్యుల పరిస్థితి ఎంత
నాలాంటి
వాడికే
ఇంత
కష్టం
అయితే
ఇంకా
సామాన్యుల
పరిస్థితి
ఎంత
దయనీయంగా
ఉంటుందో
ఊహించవచ్చు.
ఇది
చదివిన
వెంటనే
మీ
మదిలోకి
వచ్చే
ఆలోచన
"మరి
ఇలాంటివి
జరిగినపుడు,
సామాజిక
మాధ్యమాలలో
ఉండే
కంప్లైంట్
సెల్లో
ఫిర్యాదు
చేయచ్చు
కదా?",
కానీ
నేను
సామాజిక
మాధ్యమాల
కంప్లైంట్
సెల్లో
ఇచ్చినన్ని
ఫిర్యాదులు
పోలీసులకు
కూడా
ఇవ్వలేదు.
కానీ
నేను
తెలుసుకున్నది
ఏమిటంటే
ఒకరు
ప్రచురించిన
పోస్ట్
లేదా
న్యూస్
అబద్ధం
అని
నిరూపించటం
సామాజిక
మాధ్యమాలలో
కన్నా
ఇండియన్
కోర్టులోనే
చాలా
సులువు.
అందుకే
కోర్టును
ఆశ్రయించి
న్యాయం
కోసం
పోరాడుతున్నానని
అన్నారు.
ఇది వినోదంలా
ఇక ఈ ఉత్తరం చాలా మందికి వెటకారం కావచ్చు, కానీ త కుటుంబంలో స్త్రీలకో, పిల్లలకో ఇలాంటి పరిస్థితి వస్తే కానీ నా ఈ బాధ అర్థం కాదు. అలాంటి బాధను చూసిన వాళ్లకు ఈ ఉత్తరం అర్థం అవుతుంది, కానీ సోషల్ ప్లాట్ ఫారం అనే నడి వీధిలో నిలబడి వేదిక చూసిన వాళ్ళకి ఇది వినోదంలా కనిపిస్తుంది అంటూ ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు.