Don't Miss!
- News పవన్ ను ఆడిస్తున్న చంద్రబాబు-పెళ్ళిళ్లే కాదు సీట్లూ నాలుగే- కాకినాడలో జగన్ కామెంట్స్..!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మా సినిమాను చంపేసే కుట్ర.. మీ పేర్లు బయటపెడితే.. నిర్మాత, పీఆర్వోలకు బన్నీ వాసు వార్నింగ్
నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్లో నిర్మాత బన్నీవాసు రూపొందించిన వినోదాత్మక చిత్రం చావు కబురు చల్లగా. యువ హీరో కార్తీకేయ, గ్లామర్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ చిత్రం మార్చి 19న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో బన్నీ వాసు స్పీచ్ సంచలనంగా మారింది. ఆయన మాట్లాడుతూ...
సినిమా హిట్ అయితే ఇండస్ట్రీకి లాభం
కొన్ని విషయాలు మాట్లాడటానికి చావు కబురు చల్లగా సినిమా వేదిక సరైనది అవునో కాదోయ తెలియదు. ఇండస్ట్రీలో ఓ సినిమా బాగా ఆడితే అందరూ హ్యాపీగా ఫీలవుతాం. సినిమా హిట్ అయితే ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుంది. సినిమా రంగం బాగా పెరిగిపోతుందనే ఫీలింగ్లో ఉంటా. కొన్నిసార్లు మాకు లభించిన థియేటర్లు వేరే వాళ్లకు ఇచ్చి ప్రోత్సాహిస్తాం అని బన్నీ వాసు అన్నారు.
పీఆర్వోలతో తప్పుడు ప్రచారం
సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి హెల్తీ వాతావరణం ఉన్న నేపథ్యంలో నాకు ఓ విషయం తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. చావు కబురు చల్లగా సినిమా ఓటీటీలోకి త్వరలో వస్తుందనే ప్రచారం చేస్తున్నారు. ఓ నిర్మాత తన పీఆర్వోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారి పేర్లను బయటపెట్టడం ఇష్టం లేదు. నాకు పూర్తి సమాచారం ఉంది అంటూ బన్నీ వాసు సున్నితంగా మందలించారు.
చీప్ ట్రిక్స్ చేయకండి అంటూ నిర్మాతపై ఫైర్
చావు కబురు చల్లగా సినిమాపై దృష్రచారం చేస్తున్న నిర్మాత ఎన్ని సినిమాలు తీసారో తెలియదు కానీ.. ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయకండి. ఇండస్ట్రీలో రాజకీయం చేయడం నాకు ఇష్టం లేదు. మీరు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చారేమో తెలియదు కానీ.. ఆరోగ్యకరంగా పోటీ పడుదాం. మీరు మంచి సినిమా తీయండి. మేము మంచి సినిమా తీస్తాం. మీ సినిమా బాగా ఉండే ఆడుతుంది. మా సినిమా బాగా ఉంటే థియేటర్లలో ఆడుతుంది అని బన్నీ వాసు సూచించారు.
డబ్బుల కోసం సినిమాల తీయడం లేదు...
ఇలాంటి తప్పుడు ప్రచారం రాజకీయాల్లో కనిపిస్తాయి. సినిమా రంగంలో ఇలాంటి చెత్త ప్రచారం జరిగిన దాఖలాలు లేవు. అల్లు అరవింద్కు ఆహా ఓటీటీ ఫ్లాట్ఫాం ఉండవచ్చు కానీ ఓటీటీలో రిలీజ్ చేయాలంటే కోవిడ్ సమయంలోనే రిలీజ్ చేసేవాళ్లం. డబ్బుల కోసం కాకుండా థియేటర్లలో సినిమా రిలీజ్ చేసి ప్రేక్షకుల గొప్ప అనుభూతి పంచడానికి ప్రయత్నిస్తున్నాం అని బన్నీ వాసు పేర్కొన్నారు.
నిర్మాతను, పీఆర్వోల తప్పుడు ప్రచారం
ఇండస్ట్రీలో మీకు ఎంత ఎక్స్పీరియెన్స్ ఉందో తెలియదు. కానీ మీరు ఉపయోగించే చిన్న మాట, మీరు కన్ఫ్యూజ్ చేసే చిన్న మాట సినిమాను చంపేసేలా ఉంది. దాని వల్ల హెల్తీ ఇండస్ట్రీలో మీరు చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు. మీ పీఆర్వోలతో తప్పుడు మెసేజ్ పంపించి మీడియాను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీ పేరు నాకు తెలుసు.. కానీ బయటపెడితే బాగుండదు. దయ ఉంచి అలాంటి చిల్లర రాజకీయాలు మానండి అంటూ బన్నీవాసు హెచ్చరించారు.
పీఆర్వోలకు సున్నితంగా మందలింపు
చావు కబురు చల్లగా సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ చేయాలనేది మా నిర్ణయం. ఈ సందర్భంగా పీఆర్వోలకు ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. మాతో మీ జర్నీ చాలా ఉంటుంది. దయచేసి ఇలా చీప్ టెక్నిక్ ద్వారా సినిమాను కిందకు దించకండి అంటూ బన్నీ వాసు ఆవేశంగా మాట్లాడారు.
అల్లు అరవింద్ ఆపేందుకు ప్రయత్నించానప్పటికీ
చావు కబురు చల్లగా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో బన్నీవాసు ఆవేశంగా మాట్లాడుతుండగా అల్లు అరవింద్ ఆపేందుకు ప్రయత్నించారు. అయితే బన్నీవాసు అలాగే తన స్పీచ్ను కొనసాగించారు. సినిమాను చంపేసేలా వ్యవహరించవద్దని వారికి సున్నితంగా మందలించారు. ప్రస్తుతం బన్నీ వాసు వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఆ నిర్మాత, పీఆర్వోలు ఎవరనే విషయంపై మీడియా వర్గాలు ఆరా తీస్తున్నాయి.