Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
రాజమౌళికి అతడి మాటల సాయం.. త్వరలోనే ఎన్టీఆర్, చరణ్ మల్టీస్టారర్!
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత రాంచరణ్, ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయబోతోంది. బాహుబలిని మించేలా ఈ చిత్రం 300 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కబోతోంది. రాజమౌళి త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకుని వెళ్లాలని భావిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన సెట్ వర్క్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో, రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.
ఈ సారి రాజమౌళి బ్రిటిష్ కాలానికి చెందిన కథతో రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్రిటిష్ నేపథ్యంలో సాగే కథ కావడంతో మాటలు పదునుగా ఉండాలి. దీని కోసం ఈ చిత్ర మాటల రచయితగా బుర్రా సాయిమాధవ్ ని ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం గురించి అనేక ఊహాగానాలు వస్తున్నప్పటికీ చిత్ర యూనిట్ మాత్రం సైలెంట్ మైంటైన్ చేస్తోంది. వచ్చే నెలలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రంలో, రాంచరణ్ బోయపాటి చిత్రంతో బిజీగా ఉన్నారు.