twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిక్కుల్లో టాప్ ప్రొడ్యూసర్... ఆ ముగ్గురి దెబ్బకు పోలీస్ కేసు!

    |

    పలు సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన సి.కళ్యాణ్ అనుకోకుండా ఒక వివాదంలో చిక్కుకున్నారు. అది కూడా భూవివాదం కావడం ఆశ్చర్యకరంగా మారింది. సినీ నిర్మాత చిల్లర కళ్యాణ్ సహా మరో ముగ్గురు మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. బంజారా హిల్స్ పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం హైదరాబాదుకు చెందిన స్వరూప్ అనే వ్యక్తి అమెరికాలో డాక్టర్ గా స్థిరపడ్డారు.

    ఆయన 1985వ సంవత్సరంలో ఫిల్మ్ నగర్ సొసైటీ నుంచి షేక్ పేటలో కొంత భూమిని కొనుగోలు చేశాడు. అయితే అప్పటి నుంచి ఖాళీగానే ఉన్న స్థలాన్ని 2015 సంవత్సరంలో నారాయణమూర్తి అనే ఒక వ్యక్తికి లీజుకు ఇచ్చారు..

    case filed on Tollywood producer c Kalyan

    2015 లో లీజుకు తీసుకున్న నారాయణమూర్తి అక్కడ ఒక ఆర్గానిక్ స్టోర్ ఏర్పాటుచేసి అప్పటినుంచి వ్యాపారం చేస్తున్నారు.. అయితే అనుకోకుండా సోమవారం సాయంత్రం షరీఫ్, శ్రీకాంత్, తేజస్వి అనే ముగ్గురు వ్యక్తులు ఆర్గానిక్ స్టోర్ కి వెళ్లి తాము సినీ నిర్మాత సి.కళ్యాణ్ మనుషులం అని చెబుతూ అప్పటికప్పుడు షటర్ కు తాళాలు వేయడంతో నారాయణ మూర్తి ముందు ఈ విషయాన్ని స్వరూప్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ క్రమంలో స్వరూప్ తన సోదరుడికి విషయం తెలియజేయడంతో నారాయణమూర్తితో కలిసి ఆయన వెళ్లి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    వచ్చిన ముగ్గురు యువకుల మీద అలాగే సి కల్యాణ్ మీద కూడా ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఫిర్యాదు నేపధ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దానికి సంబంధించి విచారణ చేపట్టారు. ఇక సీకే ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ తో ఆయన కొన్ని సినిమాలు నిర్మిస్తున్నారు. చివరిగా నందమూరి బాలకృష్ణ వేదిక హీరోయిన్ గా వచ్చిన రూలర్ సినిమాలో ఆయన ప్రేకషకుల ముందుకు వచ్చారు.

    English summary
    case filed on Tollywood producer c Kalyan over a land issue in Hyderabad. a person named Gopi Krishna filed complaint on c Kalyan along with three others
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X