Don't Miss!
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చిక్కుల్లో టాప్ ప్రొడ్యూసర్... ఆ ముగ్గురి దెబ్బకు పోలీస్ కేసు!
పలు సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన సి.కళ్యాణ్ అనుకోకుండా ఒక వివాదంలో చిక్కుకున్నారు. అది కూడా భూవివాదం కావడం ఆశ్చర్యకరంగా మారింది. సినీ నిర్మాత చిల్లర కళ్యాణ్ సహా మరో ముగ్గురు మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. బంజారా హిల్స్ పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం హైదరాబాదుకు చెందిన స్వరూప్ అనే వ్యక్తి అమెరికాలో డాక్టర్ గా స్థిరపడ్డారు.
ఆయన 1985వ సంవత్సరంలో ఫిల్మ్ నగర్ సొసైటీ నుంచి షేక్ పేటలో కొంత భూమిని కొనుగోలు చేశాడు. అయితే అప్పటి నుంచి ఖాళీగానే ఉన్న స్థలాన్ని 2015 సంవత్సరంలో నారాయణమూర్తి అనే ఒక వ్యక్తికి లీజుకు ఇచ్చారు..
2015 లో లీజుకు తీసుకున్న నారాయణమూర్తి అక్కడ ఒక ఆర్గానిక్ స్టోర్ ఏర్పాటుచేసి అప్పటినుంచి వ్యాపారం చేస్తున్నారు.. అయితే అనుకోకుండా సోమవారం సాయంత్రం షరీఫ్, శ్రీకాంత్, తేజస్వి అనే ముగ్గురు వ్యక్తులు ఆర్గానిక్ స్టోర్ కి వెళ్లి తాము సినీ నిర్మాత సి.కళ్యాణ్ మనుషులం అని చెబుతూ అప్పటికప్పుడు షటర్ కు తాళాలు వేయడంతో నారాయణ మూర్తి ముందు ఈ విషయాన్ని స్వరూప్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ క్రమంలో స్వరూప్ తన సోదరుడికి విషయం తెలియజేయడంతో నారాయణమూర్తితో కలిసి ఆయన వెళ్లి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వచ్చిన ముగ్గురు యువకుల మీద అలాగే సి కల్యాణ్ మీద కూడా ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఫిర్యాదు నేపధ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దానికి సంబంధించి విచారణ చేపట్టారు. ఇక సీకే ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ తో ఆయన కొన్ని సినిమాలు నిర్మిస్తున్నారు. చివరిగా నందమూరి బాలకృష్ణ వేదిక హీరోయిన్ గా వచ్చిన రూలర్ సినిమాలో ఆయన ప్రేకషకుల ముందుకు వచ్చారు.