Don't Miss!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
స్మార్ట్ ఫోన్ పిచ్చోళ్లే శంకర్ టార్గెట్.. 2.0 చిత్రంలో!
శంకర్ ప్రతి చిత్రంలో ఏదో ఒక సామజిక అంశం గురించి సందేశం ఉంటుంది. శంకర్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం 2.0 చిత్రం కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. నవంబర్ నెలాఖరులో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రం గురించి సినీ వర్గాల్లో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో శంకర్ మొబైల్ ఫోన్ల వ్యసనం గురించి ప్రభావంతంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో సెల్ ఫోన్ల వాడకం ఎంత విరివిగా పెరిగిందో అందరికి తెలిసిందే. మొబైల్ ఫోన్లకు చాలా మంది బానిసలుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.
హద్దులు దాటి మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తే ఇటివంటి సైబర్ నేరాలు చోటు చేసుకుంటాయి శంకర్ ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజని నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటించాడు. అమీజాక్సన్ హీరోయిన్. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. 500 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు.