twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jr NTR తో అమిత్ షా భేటి వెనుక అసలు కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి!

    |

    నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ పై చాలా కాలం తర్వాత రాజకీయాలకు సంబంధించిన అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి గ్యాప్ ఇచ్చి చాలా కాలం అయిన తర్వాత ఇప్పుడు హఠాత్తుగా ఆయన బిజెపి నేతను కలవడంపై అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇంత సడన్ గా ఎన్టీఆర్ ను ఎందుకు కలిశారనే లనే అనుమానాలపై బిజెపి కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలు ఎన్టీఆర్ అమిత్ మీటింగ్ వెనకున్న అసలు కారణాన్ని ఆయన వివరంగా తెలియజేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

    గతంలో ప్రచారాలు

    గతంలో ప్రచారాలు

    జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి చాలా కాలంగా దూరంగానే ఉన్నారు. గతంలో ఆయన తండ్రి సలహా మేరకు తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకంగా ప్రచారాలు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారాలు చేసినప్పుడు పార్టీకి పెద్దగా ఉపయోగపడింది లేదు. అప్పట్లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఇక అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ మధ్యలో తాను ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను అని తెలియజేశాడు.

     అమిత్ షాను.కలుసుకోవడంతో..

    అమిత్ షాను.కలుసుకోవడంతో..

    ఇక జూనియర్ ఎన్టీఆర్ తన స్టార్ హోదాను ఇంకాస్త పెంచుకున్న తర్వాత రాజకీయాలకు చాలా వరకు దూరంగానే ఉంటున్నాడు. ఎలాంటి సెన్సిటివ్ విషయాలపై కూడా ఆయన పెద్దగా స్పందించడం లేదు. ముఖ్యంగా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఎన్టీఆర్ రాజకీయాలకు కూడా చాలా వరకు దూరంగానే ఉంటాడు అని అందరూ అనుకున్నారు. అయితే ఇదే తరుణంలో ఆయన కేంద్ర మంత్రి అమిత్ షాను కలుసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

    స్పెషల్ డిన్నర్.. సీక్రెట్ మీటింగ్

    స్పెషల్ డిన్నర్.. సీక్రెట్ మీటింగ్

    మునుగోడు ఉప ఎన్నికల కోసం బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం రోజు హైదరాబాద్ కు వచ్చారు. అటు నుంచి ఒక స్టార్ హోటల్ లో ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. తారక్ తో ప్రత్యేకంగా డిన్నర్ చేసిన అమిత్ షా ఆ తరువాత సీక్రెట్ గా సమావేశం కూడా నిర్వహించారట. దాదాపు 20 నిమిషాల పాటు అమిత్ షా ఎన్టీఆర్ మధ్య చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అనే విషయంలో ఎవరు కూడా మొదట్లో క్లారిటీ ఇచ్చింది లేదు.

     కారణం అదే..

    కారణం అదే..

    అయితే ఎక్కువగా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాలో అతను చేసిన పాత్రకు గాను ప్రత్యేకంగా అభినందించడం కోసమే అమిత్ షా కలుసుకున్నట్లుగా చాలామంది మాట్లాడుకున్నారు. కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించినట్లుగా గతంలోనే అమిత్ షా కొన్ని మీటింగ్స్ లలో తెలియజేశారు. ఇక ఇప్పుడు అందుకోసమే ఆయనను కలుసుకోవాలని కోరికతో ఈ విధంగా డిన్నర్ ఏర్పాటు చేసినట్లుగా ట్రాక్ అయితే వచ్చింది.

    క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి

    క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి

    ఇక అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ భేటీ పై అనేక రకాల వార్తలు వైరల్ అవుతూ ఉండడంతో వెంటనే ఈ విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ తో కలిసి డిన్నర్ చేయాలని ఉంది అని అమిత్ షా గారి ప్రత్యేకంగా కోరడం జరిగింది. కేవలం సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందని ఇది రాజకీయాలకు సంబంధించి కాదు అని ఎలాంటి పాలిటిక్స్ కూడా మాట్లాడుకోలేదు అని కిషన్ రెడ్డి తెలియజేశారు అంతేకాకుండా సీనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ఆయన ఆసక్తిగా అడిగి తెలుసుకున్నట్లు వివరణ ఇచ్చారు.

    English summary
    Central minister kishan reddy clarification on jr ntr and amit shah meeting
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X