Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
NBK107: బాలయ్యతో ఇండో ఆస్ట్రేలియన్ బ్యూటీ.. లుక్ అదిరిపోయిందిగా!
యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీతో దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా హవాను చూపిస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ కుమారుడిగా పరిచయమైనా.. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఫలితంగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. అయితే, కొంత కాలంగా ఆయన సరైన బ్రేక్ను మాత్రం అందుకోలేకపోయారు. దీంతో వరుస పెట్టి సినిమాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది 'అఖండ' మూవీతో ప్రేక్షఖుల ముందుకు వచ్చారు. ఇది మాత్రం ఆయనకు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ను అందించింది.
మళ్లీ ఒక్కటైన షణ్ముఖ్, దీప్తి సునైనా: ఇద్దరూ ఒకే ఫొటో షేర్ చేసి మరీ రిక్వెస్ట్
'అఖండ' సక్సెస్తో నందమూరి బాలకృష్ణ మరింత ఉత్సాహంగా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు దర్శకులకు ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. అందులో యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఒకడు. గత ఏడాది మాస్ మహారాజా రవితేజతో తీసిన 'క్రాక్'తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ దర్శకుడు.. ఆ వెంటనే బాలయ్య కోసం అదిరిపోయే పవర్ఫుల్ స్టోరీని రెడీ చేసి పెట్టాడు. ఇందుకోసం పల్నాడు ఏరియాలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనలను ఆధారంగా తీసుకున్నాడు. దీంతో ఈ సినిమాపై ఆరంభంలోనే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడిన విషయం తెలిసిందే.
బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమాను ఎప్పుడో మొదలు పెట్టాల్సి ఉంది. కానీ, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడం.. బాలయ్య భుజానికి సర్జరీ జరగడం.. ఆ తర్వాత ఆయన ఓ టాక్ షోను హోస్ట్ చేయడం వంటి వాటి వల్ల ఇది ఆలస్యం అయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం అయింది. తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల పట్టణంలో దీన్ని మొదలు పెట్టి అప్పటి నుంచి పలు ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన చాలా వరకు షూట్ను కూడా ఇప్పటికే పూర్తి చేసుకున్నరనే టాక్ వినిపిస్తోంది.
బెడ్పై బ్రాతో అషు రెడ్డి రచ్చ: ఏకంగా అవి చూపిస్తూ రెచ్చిపోయిందిగా!
క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాలో ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ను పెట్టారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇందులో డ్యాన్స్ చేసే వాళ్ల విషయంలో డింపుల్ హయాతి సహా కొంత మంది హీరోయిన్లు పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ స్పెషల్ సాంగ్లో చంద్రిక రవి అనే ఇండో ఆస్ట్రేలియన్ బ్యూటీ చేయబోతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ఆ తర్వాత చిత్ర యూనిట్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చేసింది. అదే సమయంలో బాలయ్య ఈ సెట్స్లో దిగిన ఫొటో కూడా విపరీతంగా వైరల్ అవుతోంది.
పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ సరసన హాట్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. రిషి పంజాబీ దీనికి సినిమాటోగ్రాఫర్గా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేసే ఛాన్స్ ఉంది.