Don't Miss!
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరంజీవి సంచలన నిర్ణయం.. 25 లక్షల విరాళం!
తెలుగు సినిమా పురోగతికి, ప్రతిష్టకు దిశానిర్దేశం చేసిన స్వర్గీయ దాసరి నారాయణరావును ఘనంగా స్మరించుకొన్నారు. సినీ పరిశ్రమకు చేసిన సేవలకు ఆయనకు నిజమైన నివాళిని అర్పించారు. హైదరాబాద్లో దాసరి నారాయణరావు పుట్టిన రోజు మే 4న డైరెక్టర్స్ డేగా పాటిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, డైరెక్టర్లతోపాటు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన సంచలన నిర్ణయం తీసుకొన్నారు.
శనివారం సాయంత్రం జరిగిన డైరెక్టర్స్ డే కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి హాజరుకావడంతో భారీగా వేడుకను జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దాసరి నారాయణ సేవలను మెగాస్టార్ గుర్తు చేసుకొన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని మరోసారి వేదికపైన వెల్లడించారు. ఆయన లేకపోవడం సినిమా పరిశ్రమకు తీరని లోటు అని చిరంజీవి అన్నారు.
ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన దర్శకుల సంఘానికి తన వంతు సహాయంగా 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. చిరంజీవి ఆర్థిక సహాయంపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.