చిరంజీవిని ఆశ్చర్యపరిచిన మహేష్ బాబు 'ఏఎంబి సినిమాస్'!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా చిత్ర షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. సినిమాని అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు చిరు తన వయసుని కూడా లెక్కచేయకుండా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా షూటింగ్ నుంచి చిరుకు కొంత విరామం దొరికినట్లు ఉంది. అందుకే తన బావమరిది అల్లు అరవింద్ తో కలసి సూపర్ స్టార్ మహేష్ ఏఎంబి సినిమాస్ ని చిరు సందర్శించాడు.
గచ్చిబౌలిలో అధునాతన హంగులతో మహేష్ బాబు మల్టిప్లెక్స్ స్క్రీన్ ఏఎంబి సినిమాస్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా చిరంజీవి, అల్లు అర్జున్ ఎంఎబి సినిమాస్ ని సందర్శించి అందులోని ప్రత్యేకతల్ని తెలుసుకున్నారు. థియేటర్ లో డిజైన్, ప్రస్తుత టెక్నాలజీతో ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలు చిరంజీవిని ఆశ్చర్యపరిచినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా చిరంజీవి మహేష్ బాబు అభిరుచిని ప్రశంసించారు. ఏఎంబి సినిమాస్ లో అల్లు అరవింద్ తో కలసి ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ బాబు భవిష్యత్తులో అన్ని నగరాలలో ఏఎంబి సినిమాస్ ని విస్తరించబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











