Don't Miss!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరంజీవిని ఆశ్చర్యపరిచిన మహేష్ బాబు 'ఏఎంబి సినిమాస్'!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా చిత్ర షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. సినిమాని అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు చిరు తన వయసుని కూడా లెక్కచేయకుండా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా షూటింగ్ నుంచి చిరుకు కొంత విరామం దొరికినట్లు ఉంది. అందుకే తన బావమరిది అల్లు అరవింద్ తో కలసి సూపర్ స్టార్ మహేష్ ఏఎంబి సినిమాస్ ని చిరు సందర్శించాడు.
గచ్చిబౌలిలో అధునాతన హంగులతో మహేష్ బాబు మల్టిప్లెక్స్ స్క్రీన్ ఏఎంబి సినిమాస్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా చిరంజీవి, అల్లు అర్జున్ ఎంఎబి సినిమాస్ ని సందర్శించి అందులోని ప్రత్యేకతల్ని తెలుసుకున్నారు. థియేటర్ లో డిజైన్, ప్రస్తుత టెక్నాలజీతో ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలు చిరంజీవిని ఆశ్చర్యపరిచినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా చిరంజీవి మహేష్ బాబు అభిరుచిని ప్రశంసించారు. ఏఎంబి సినిమాస్ లో అల్లు అరవింద్ తో కలసి ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ బాబు భవిష్యత్తులో అన్ని నగరాలలో ఏఎంబి సినిమాస్ ని విస్తరించబోతున్నట్లు తెలుస్తోంది.