Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
కాకర్ల మృతికి చిరంజీవి సంతాపం: దేశంలోనే నెంబర్ వన్గా మార్చారంటూ ట్వీట్
ప్రముఖ వైద్యులు, నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు ఈరోజు మరణించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతోన్న ఆయన హైదరాబాద్లోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ఆయన పరిస్థితి విషమించింది. సకాలంలో వైద్యులు స్పందించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ది గ్రేట్ డాక్టర్ కాకర్ల ఆ ఆస్పత్రిలోనే కన్నుమూశారు. ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులంతా సంతాపం తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ ట్వీట్ చేశారు.
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి.. కాకర్ల సుబ్బారావు మృతిపై సంతాపం తెలియజేశారు. ఈ మేరకు తన ట్విట్టర్లో ఆయన ఫొటోను షేర్ చేస్తూ.. 'ప్రఖ్యాతి చెందిన డాక్టర్ కాకర్ల సుబ్బారావు మరణ వార్త నన్ను కలచి వేసింది. ఆయన ఒక రేడియోలజిస్ట్ మాత్రమే కాదు.. దూర దృష్టి కలిగిన వైద్యులు. మన నిమ్స్ను దేశంలోనే నెంబర్ స్థానంలో నిలిపేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. 96 సంవత్సరాల అర్థవంతమైన జీవితానికి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా' అంటూ రాసుకొచ్చారు.
కృష్ణా జిల్లాకు చెందిన కాకర్ల సుబ్బారావు ఆంధ్ర విశ్వవిద్యాలయంతో డాక్టర్ పట్టా పొందటంతో పాటు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ తర్వాత హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెషర్గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత నిమ్స్లోకి వచ్చి చాలా కాలం పాటు పలు విభాగాల్లో సేవలు అందించారు. అనంతరం దానికి డైరెక్టర్గానూ పని చేశారు.