Don't Miss!
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఎయిర్పోర్ట్కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు.. చిరంజీవి ఎమోషనల్
భారతదేశ తొలి స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఆయన జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాను తీశాడు. అయితే తాజాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును కర్నూలు జిల్లాలోని ఎయిర్ పోర్ట్కు పెడతామని ఏపీ ప్రభుత్వం ప్రకటించడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ ప్రకటనపై చిరంజీవి స్పందించాడు.
కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ప్రకటించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించిన ఓర్వకల్లు ఎయిర్పోర్టును కేంద్రమంత్రి పి హర్దీప్సింగ్తో కలిసి సీఎం జగన్ గురువారం ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సీఎం జగన్ ప్రకటించాడు.
ఈ విషయంపై చిరంజీవి స్పందిస్తూ.. 'భారత ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును కర్నూలు ఎయిర్పోర్ట్కు పెట్టామని గౌరవనీయులైన సీఎం జగన్ ఇచ్చిన ప్రకటన నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. గొప్ప దేశభక్తుడు, ప్రపంచానికి తెలియని యోధుడికి ఇప్పుడు సరైన గుర్తింపు లభించింది. అలాంటి గొప్ప వ్యక్తి పాత్రను తెరపై పోషించే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టం' అని అన్నాడు.