Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
సోషల్ మీడియాలోకి మెగాస్టార్ ఎంట్రీ.. అందుకోసమేనంటూ వీడియో సందేశం
జనాలకు సోషల్ మీడియా ఎంతగా అలవాటైపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ఖాతాలు లేనివారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. సామాన్య జనం నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ సోషల్ మీడియాలో ఉన్నవారే. సినిమా అప్డేట్స్ ఇవ్వడంతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు తారలు.
దాదాపు హీరోలంతా సోషల్ మీడియాలో యాక్టివ్గా అభిమానులకు అందుబాటులో ఉంటారు. తమ అభిప్రాయాలను తెలపడమే కాకుండా, ఫ్యాన్స్ను ప్రోత్సహించడం, అవగాహన కల్పించడం వంటివి చేస్తుంటారు. తెలుగులో అత్యధిక ఫాలోయిగ్ ఉన్న హీరోల్లో మహేష్ బాబు ముందుంటాడు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటిల్లో మహేష్ ఎంత యాక్టివ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ప్రభాస్, రామ్ చరణ్ వంటివారు సోషల్ మీడియాలో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చాడు. అభిమానులతో తన అభిప్రాయాలను పంచుకోవడానికి, తన ఆలోచనలను ప్రజలతో పంచుకోవడానికి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇస్తున్నానని, ఈ ఉగాది రోజున సోషల్ మీడియా ఖాతాను ప్రారంభిస్తానని వీడియో సందేశం ద్వారా తెలిపాడు. ఈ మేరకు నాగబాబు, వరుణ్ తేజ్ వంటి చిరంజీవి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇప్పటికే మూడు లక్షల మందికిపైగా పాలోవర్స్ వచ్చి చేరారు.