twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైఎస్ జగన్ లో తొలిసారిగా అగ్ర హీరోలు.. ఆ స్టార్స్ కూడా రావాలని మెగాస్టార్ కండిషన్!

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీ మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఇండస్ట్రీలో బిగ్ హీరోలు కూడా రావాల్సిందే అని మెగాస్టార్ చిరంజీవి కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న టిక్కెట్ల రేట్లపై కొనసాగుతున్న జీవో విషయంలో తప్పనిసరి మార్పులు చేయాల్సిందే అని అందరూ ఇదివరకే చాలాసార్లు చర్చలు జరిపారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కొంతమంది స్టార్ హీరోలకు ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ మీటింగ్ కు హాజరుకావాలని చెప్పారట. ఆ వివరాల్లోకి వెళితే..

    కోర్టుకు వెళ్లినా..

    కోర్టుకు వెళ్లినా..

    తెలుగు చిత్ర పరిశ్రమకు ఒకవైపు కరోనా భారీ స్థాయిలో దెబ్బ కొట్టగా మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కొత్త టికెట్ల రేట్లు అందరిని కన్ఫ్యూజన్ లో పడేశాయి. కనీసం థియేటర్స్ ను మెయింటైన్ చేసే విధంగా టికెట్ల రేట్లు లేవని ఇది చాలా దారుణమని కూడా డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కోర్టుకు వెళ్లినా కూడా ఎలాంటి సొల్యూషన్ దొరకలేదు. ఆ కేసు వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది.

    మంత్రులతో మీటింగ్స్

    మంత్రులతో మీటింగ్స్

    ఇక ఇదివరకే చాలాసార్లు సినిమాటోగ్రఫీ మినిష్టర్ పేర్ని నానితో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ కూడా చర్చలు జరపడం జరిగింది. ఇక ప్రెస్ మీట్లు పెట్టి వివరణ ఇవ్వడం తప్పితే టికెట్ల రేట్ల విషయంలో సరైన క్లారిటీ మాత్రం రాలేదు. మెగాస్టార్ చిరంజీవి కూడా చాలాసార్లు ఏపీ ప్రభుత్వ నేతలతో మాట్లాడడం జరిగింది. అయినా కూడా వర్కౌట్ కాలేదు. ఇక జనాలు కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం మానేశారు.

     రామ్ గోపాల్ వర్మ కౌంటర్స్

    రామ్ గోపాల్ వర్మ కౌంటర్స్

    ఇక ఆఖరికి రామ్ గోపాల్ వర్మ కూడా పేర్ని నానితో మీటింగ్ కు వెళ్లిన విషయం తెలిసిందే. అంతకుముందు సోషల్ మీడియాలో అనేక రకాల ఉదాహరణలతో కూడా రామ్ గోపాల్ వర్మ కౌంటర్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అప్పుడే ఒక సమాధానం వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడు కూడా ఎలాంటి లాభం లేకుండా పోయింది.

    మెగాస్టార్, మహేష్ కలిసి..

    మెగాస్టార్, మహేష్ కలిసి..

    ఇక ఇప్పుడు మరోసారి మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో స్టార్ హీరోలు అందరూ కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలవడానికి సిద్ధమయ్యారు. మహేష్ బాబు కూడా వెళ్ళడానికి రెడీ అయ్యాడు. అయితే గతంలో మాదిరిగా కేవలం సీనియర్ స్టార్స్ మాత్రమే కాకుండా ఈసారి పాన్ ఇండియా స్టార్స్ అగ్ర హీరోలు అందరూ కూడా రావాలని మెగాస్టార్ ప్రత్యేకంగా వివరణ ఇచ్చినట్లు సమాచారం. అందుకు మిగతా హీరోలు కూడా ఒప్పుకున్నట్లు టాక్.

    ఆ హీరోలు కూడా రావాల్సిందే..

    ఆ హీరోలు కూడా రావాల్సిందే..

    ఇక మెగాస్టార్ చిరంజీవి అలాగే మరికొందరు టాలీవుడ్ హీరోలు ఈ నెల 10న గురువారం రోజు ప్రత్యేకంగా జగన్ తో టాలీవుడ్ సమస్యలపై చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇక మెగాస్టార్ అయితే ఎన్టీఆర్, ప్రభాస్ కు కూడా ప్రత్యేకంగా మాట్లాడి మీటింగ్ కు రావాలని చెప్పారట. మహేష్ బాబు అయితే ముందుగానే మెగాస్టార్ రావడానికి సిద్ధమయ్యారు. మరి ఈ మీటింగ్ తో అయినా టికెట్ల రేట్లపై ఏదైనా సమాధానం దొరుకుతుందో లేదో చూడాలి.

    English summary
    Chiranjeevi have invited Prabhas and NTR also for ap cm meeting.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X