Don't Miss!
- News ఏపీలో ఇప్పటివరకు భారీగా పట్టుబడిన నగదు, మద్యం, బంగారం.. అత్యధికంగా ఎక్కడంటే
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మొక్కే కదా అని వదిలేస్తే.. చిరు పోస్ట్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇంతవరకు చిరు కామెడీ టైమింగ్ను వెండితెరపై చూసి ఎంజాయ్ చేసిన వారికి సోషల్ మీడియాలో అంతకుమించి ఎంర్టైన్మెంట్ దొరుకుతోంది. చిరు చేసే ప్రతీ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఉగాది పర్వదినాన రంగంలోకి దిగిన చిరంజీవి.. సోషల్ మీడియాను చెడుగుడు ఆడేస్తున్నాడు. ఎవరికి ఏ టైప్లో కౌంటర్ ఇవ్వాలో ఇచ్చేస్తూ.. అందరి లెక్కలు సరిచేసేస్తున్నాడు. వరుస ట్వీట్లతో హల్చల్ చేస్తున్న చిరంజీవి దూకుడుకు నెటిజన్స్లు షాక్ అవుతున్నారు. ఇన్నాళ్లు చిరును చాలా మిస్ అయ్యామని కామెంట్స్ చేస్తున్నారు.
కేవలం ట్విట్టర్నే కాదు ఇన్స్టాగ్రామ్ను కూడా ఓ రేంజ్లో వాడేస్తున్నాడు. కాసేపటి క్రితమే చిరు చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఇంద్ర సినిమాలోని ఎవర్ గ్రీన్ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తా.. అదే డైలాగ్ను గుర్తు చేస్తూ.. మొక్కే కదా అని వదిలేస్తే.. అంటూ అలా డ్యాష్లతో వదిలేశాడు. ప్రతీ రోజూ ఉదయం తన దినచర్య అలా మొక్కలకు నీళ్లు పట్టడంతో మొదలవుతుందని తెలిపాడు. ఈ 21 రోజుల లాక్ డౌన్ను పాటించండని, ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండని పోస్ట్ చేశాడు.
View this post on Instagram“ మొక్కే కదా అని వదిలేస్తే, ... ... " my duty every morning #21daylockdown #StayHomeStaySafe
A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on