Don't Miss!
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News పవన్కు బిగ్ షాక్..వైసీపీలోకి జనసేన కీలక నేత
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
మెగాస్టార్తో సూపర్ స్టార్.. మంతనాలకు కారణం? వైరల్ పిక్ షేర్ చేసిన మహేష్ సతీమణి
మెగాస్టార్ చిరంజీవితో సూపర్ స్టార్ మహేష్ బాబు ఏవో మంతనాలు చేస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఓ ప్రైవేట్ మీట్ పెట్టుకొని కాసేపు ముచ్చటించడం హాట్ టాపిక్ అయింది. జనవరి 5వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరగబోయే 'సరిలేరు నీకెవ్వరు' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు చిరంజీవి. సరిగ్గా ఈ సమయంలో ఈ ఇద్దరూ మీట్ అయ్యారంటే ఏదో పెద్ద స్కెచ్చే వేస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది.
పైగా మెగాస్టార్తో సూపర్ స్టార్ కలిసిన ఈ పిక్ తన ఇన్స్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.. 'ఓకే రకమైన మనస్తత్వం కలిగిన ఇద్దరు యాక్టర్స్ మీట్' అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ పిక్ చూసి మెగా, ఘట్టమనేని అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేదికపై ఈ అరుదైన కలయిక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాతోనే వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.