ఆ స్టార్ హీరో ఫామ్ హౌస్ కి మకాం మార్చనున్న చిరంజీవి.. ఎందుకంటే?
మెగాస్టార్ చిరంజీవి తన తోటి హీరోలతో ఎంత సఖ్యతగా మెలుగుతారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన తెలుగు భాషకు సంబంధించిన హీరోలతోనే కాక తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కు సంబంధించిన హీరోలతో కూడా చాలా సన్నిహిత సంబంధాలు నెరుపుతూ ఉంటారు. అయితే ఒక సినిమా షూటింగ్ కోసం ఆయన ఒక స్టార్ హీరో ఫామ్ హౌస్ కి వెళ్లబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. కొన్నాళ్లపాటు చిరంజీవి సదరు స్టార్ హీరో ఫామ్ హౌస్ లో బస చేయబోతున్నారు అని ఆ హీరో కూడా చిరంజీవితో బస చేయబోతున్నారు అని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఆచార్యతో ప్రేక్షకుల ముందుకు
ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి సైరా నరసింహారెడ్డితో చివరి సారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత అపజయం ఎరగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఆచార్య సినిమా రూపొందుతోంది.

లూసిఫర్ సినిమా రీమేక్
ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ఫిబ్రవరి నెలలో విడుదల కావాల్సి ఉంది కానీ అనుకోని కారణాలతో వాయిదా పడింది. సమ్మర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే చిరంజీవి మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో
తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ని సంప్రదించినట్లు ఆ మధ్య ప్రచారం జరింది. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో సల్మాన్ ఖాన్ నటించబోతున్నారని థమన్ కూడా క్లారిటీ ఇచ్చేయడంతో అది అధికారికం అయినట్టే. ఈ సినిమా గాడ్ ఫాదర్ పేరుతో విడుదల కానుండగా లూసిఫర్ ఒరిజినల్ వెర్షన్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో సల్మాన్ ఖాన్ నటించనున్నారని అంటున్నారు.

మార్చి 12 నుండి
తాజా సమాచారం మేరకు గాడ్ ఫాదర్ షూటింగ్ కోసం చిరంజీవి హైదరాబాద్ నుండి వెళ్లి ముంబైకి వెళ్లాల్సి వస్తోంది. సల్మాన్ మరియు చిరు ముంబైలోని ఒక ప్రైవేట్ ఫిల్మ్ స్టూడియోలో వారం రోజుల పాటు షూటింగ్ జరుపుకోనున్నారని అంటున్నారు. షూట్ సమయంలో, చిరు -సల్మాన్ ముంబైలోని సల్మాన్ ఖరీదైన పన్వెల్ ఫామ్హౌస్లో బస చేయనున్నారు అని అంటున్నారు. అందుతున్న సమాచారం మేరకు సల్మాన్ మార్చి 12 నుండి కర్జాత్లోని ఎన్డి స్టూడియోస్లో చిరంజీవితో గాడ్ఫాదర్ షూటింగ్ లో పాల్గొననున్నారు.

కీలక సన్నివేశాలు
నిజానికి ఈ షూట్ జనవరిలో జరగాల్సి ఉంది. అయితే, చిరంజీవికి కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆలస్యం అయింది. ఇద్దరు సూపర్స్టార్లు కలిసి చేయనున్న షూటింగ్ వారం రోజుల షెడ్యూల్గా జరగబోతోంది. ఈ సెటప్లో కొన్ని యాక్షన్ సీన్స్ సహా కొన్ని కీలక సన్నివేశాలు జరగనున్నాయి అని అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం మేకర్స్ బ్రిట్నీ స్పియర్ ను సంప్రదించారని కూడా ఆ మధ్య థమన్ వెల్లడించారు. ఈ సినిమాను ఎన్వి ప్రసాద్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











