Don't Miss!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
చిరంజీవితో పవన్ కల్యాణ్.. రూమర్లకు చెక్పెట్టిన నాదెండ్ల
సినీ తారలు, రాజకీయ నేతలు కలుసుకోవడం సర్వసాధారణమే. ఇక రాజకీయాలతో సంబంధమున్న సినీ సెలబ్రిటీలు కలుసుకోవడం తరుచుగా కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా చిరంజీవితో జనసేన నేతలు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ కలుసుకోవడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో వీరిద్దరి కలయిక ప్రధాన్యం సంతరించుకొన్నది.
చిరంజీవితో భేటీ కావడంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. సైరా నర్సింహారెడ్డి (చిరంజీవి)ని కల్యాణ్ గారు, నేను కలుసుకొన్నాం. ఈ సందర్భంగా మా మధ్య పలు అంశాలు చర్చలకు వచ్చాయి. జీవన ప్రమాణాలు, స్ఫూర్తి కలిగించే విషయాల గురించి మాట్లాడుకొన్నాం. మాకు స్ఫూర్తిని కలిగించే మాటలను చిరంజీవి చెప్పారు. అలాగే చిరంజీవితో ఇలాంటి సమావేశం కోసం, ఆసక్తికరమైన అంశాలపై చర్చించే అవకాశం కోసం ఎదురుచూస్తుంటాను అని మనోహర్ నాదెండ్ల పేర్కొన్నారు.
పవన్ తప్పు చేశాడు.. మాజీ సీఎంను ఆదర్శంగా తీసుకోవాలి.. జగన్లా చేయాలి: రచయిత షాకింగ్ కామెంట్స్
Kalyan Garu and me had a wonderful meeting with Sye Raa ! Narasimha Reddy (Chiranjeevi Garu). Among the many topics that we discussed his life journey really enriched and inspired us. Wishing him great success and looking forward to more such interesting conversations. pic.twitter.com/UXzimILKNK
— Manohar Nadendla (@mnadendla) July 24, 2019
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనిని ఆయన ఇటీవలే పూర్తి చేశారు. త్వరలోనే కొరటాల శివ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా, ఏపీ, దేశ రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాదేండ్ల మనోహర్ ఇటీవల ఎన్నికల హడావిడి నుంచి తేరుకొంటున్నారు. జనసేన ఓటమి గురించి విశ్లేషణలు సాగిస్తున్నారు. తానా సభల్లో పాల్గొని ఇటీవలే స్వదేశానికి చేరుకొన్నారు. కాగా చిరంజీవి, పవన్ మధ్య సంబంధాలపై వస్తున్న రూమర్లకు చెక్ చెప్పే విధంగా ఈ ఫొటో ఉందనే విషయం గమనార్హం.