చిరంజీవి కారావాన్ డ్రైవర్ మృతి.. ఆచార్య సెట్లో అసలేం జరిగిందంటే
టాలీవుడ్ను కరోనావైరస్ వెంటాడుతున్నట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే పలు షూటింగుల్లో పలువురు కరోనావైరస్ బారిన పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా చిరంజీవి కార్వాన్ డ్రైవర్ కూడా కరోనా బారిన పడి మరణించినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఇద్దరు మెగా అభిమానులు ప్రసాదరావు, వెంకటరమణ మరణంతో విషాదంలో కూరుకుపోయిన చిరంజీవి తన కార్వాన్ డ్రైవర్ మరణం నుంచి ఇంకా బయటపడలేదనే విషయం తెలుస్తున్నది.
హాట్ హాట్గా సినీ హీరోయిన్లు.. స్థూలకాయం నుంచి సన్నజాజిలా మారిన భామల (ఫోటోలు)
చిరంజీవి కారావాన్కు డ్రైవర్గా వ్యవహరించే వ్యక్తికి కొద్ది రోజలు క్రితం కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయనకు మెరుగైన చికిత్సను అందించారు. వైరస్ తీవ్రత ఎక్కువగా కావడంతో ఆయన చికిత్స పొందుతూనే కొద్ది రోజుల క్రితం మరణించారు అని తెలిసింది.

ఇక ఆచార్య షూటింగులో రెగ్యులర్గా పాల్గొన్న సోనూసూద్తోపాటు మరికొంత కూడా కోవిడ్19 పడటంతో పరిస్థితి గంభీరంగా మారింది. ఇలాంటి పరిస్థితిలో ఆచార్య షూటింగును నిరవధికంగా వాయిదా వేయాలని నిర్మాత రాంచరణ్ నిర్ణయం తీసుకొన్నారు.
ఆచార్య విషయానికి వస్తే.. మరో 15 రోజుల షూటింగు మిగిలి ఉందని, మిగితా షూటింగ్ అంతా పూర్తయింది. అయితే రంజాన్ కానుకగా రిలీజ్ చేయాలనుకొన్న ఈ చిత్రం కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడినట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











