Don't Miss!
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- News చంద్రబాబు బచ్చా కామెంట్ కు జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇలా...!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
మళ్లీ మొదలెట్టబోతున్న చిరంజీవి: ఈ సారి మొత్తం మార్చేసి సరికొత్త ప్లాన్తో ఎంట్రీ
సుదీర్ఘ విరామం తర్వాత 'ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి. అది సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు పలు రికార్డులను క్రియేట్ చేయడంతో ఆయనలో ఉత్సాహం రెట్టించింది. దీంతో అప్పటి నుంచి వరుసగా సినిమాల మీద సినిమాలను ప్రకటిస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు చిరంజీవి.. రామ్ చరణ్తో కలిసి 'ఆచార్య' అనే సినిమాలో నటించారు. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తైపోయింది. దీంతో తన ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద ఆయన పూర్తిగా ఫోకస్ చేసుకుంటున్నారు.
బీచ్లో ప్యాంట్ లేకుండా బిగ్ బాస్ దివి రచ్చ: వామ్మో ఈ తెలుగు పిల్లను ఇలా చూశారంటే!
'ఆచార్య' మూవీ పట్టాలపై ఉన్న సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి పలు ప్రాజెక్టులను మొదలు పెట్టేశారు. అందులో 'గాడ్ ఫాదర్' సినిమా ఒకటి. సీనియర్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన మాలయాళ చిత్రం 'లూసీఫర్'కు ఇది రీమేక్గా తెరకెక్కుతోన్న సంగతి తెలసిందే. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెలుగులో తెరకెక్కిస్తున్నాడు. రాజకీయ నేపథ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. అంతేకాదు, ఇప్పటికే రెండు షెడ్యూళ్లను కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు.
పొలిటికల్ బ్యాగ్డ్రాప్తో తెరకెక్కుతోన్న 'గాడ్ ఫాదర్' మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే 45 శాతం వరకూ పూర్తైందని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. ఆ మధ్య దీనికి సంబంధించిన షెడ్యూళ్లను ప్లాన్ చేసుకున్నా.. అనివార్య కారణాల వల్ల అవి మాత్రం ముందుకు సాగలేదు. దీంతో చాలా ఆలస్యం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హైదరాబాద్లో ఈ సినిమా మరో షెడ్యూల్ను జరుపుతున్నారు. ఇందులో యంగ్ హీరో సత్యదేవ్ సహా పలువురు కీలక నటీనటులతో అత్యంత ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ చాలా రోజుల పాటు సాగబోతున్నట్లు తెలుస్తోంది.
యంగ్ క్రికెటర్తో బాలయ్య హీరోయిన్ నైట్ పార్టీ: ఇద్దరూ అలా దొరికిపోవడంతో కలకలం!
ఇక, ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' షూటింగ్ జరుగుతోన్న సమయంలో కరోనా బారిన పడ్డారు. దీంతో ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండి చికిత్సను తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన దాని నుంచి కోలుకున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే మళ్లీ షూటింగ్లో పాల్గొనబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 8 నుంచి చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ షూటింగ్లో భాగం కాబోతున్నారట. ఇప్పటికే ఈ మేరకు చిత్ర యూనిట్కు ఆయన హామీ ఇచ్చారని తెలిసింది. అంతేకాదు, దీనికోసం దాదాపు 20 రోజుల పాటు డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది.
క్రేజీ కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'గాడ్ ఫాదర్' సినిమాలో చిరంజీవి రాజకీయాల్లో చక్రం తిప్పే వ్యక్తిగా నటిస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి ఆ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రను చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే, ఇందులో నయనతార కూడా నటిస్తోంది. వీళ్లతో పాటు చాలా మంది కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.