Don't Miss!
- News దానం నాగేందర్ కు షాక్ - కాంగ్రెస్ అభ్యర్ది మార్పు..!?
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దేవుడితో కలిసి నా సినిమా చూశా.. కల నిజమైన రోజు.. డైరెక్టర్ ఎమోషనల్ ట్వీట్
సినిమా రంగానికి రావాలని ఆశను రేకెత్తించిన వ్యక్తి, సినిమా రంగం పట్ల స్ఫూర్తి నింపిన వ్యక్తిని కలవడమే అదృష్టమని అనుకుంటారు. అలాంటి వ్యక్తి పక్కనే కూర్చుని తాను తీసిన సినిమా వీక్షించడం, ప్రశంసించడం చేస్తే ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించలేము. ప్రస్తుతం డైరెక్టర్ వెంకీ కుడుముల పరిస్థితి కూడా అలానే ఉంది. ఛలో సినిమాతో మంచి హట్ కొట్టిన వెంకీ.. ద్వితీయ విఘ్నాన్ని దాటుకుని భీష్మతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు.
మొదటి వారంలోనే లాభాల్లోకి..
ఫిబ్రవరి మాసంలో విడుదలైన అన్ని సినిమాల్లోకెల్లా భీష్మ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా నితిన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా రికార్డులు క్రియేట్ చేసింది. ఫిబ్రవరిలో బాక్సాఫీస్ను కళకళలాడేలా చేసింది భీష్మ చిత్రమే.
పవన్ కళ్యాణ్ మెచ్చిన చిత్రం..
భీష్మ చిత్రం విజయం సాధించినందుకు పవన్ కళ్యాణ్ చిత్రయూనిట్కు ప్రత్యేకంగా అభినందించాడు. డైరెక్టర్, హీరో, నిర్మాతలకు మూవీ సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్ తెలిపాడు. వీలు చూసుకుని సినిమాను వీక్షిస్తానని చెప్పినట్టు పవన్ పేర్కొన్నాడు.
చిత్రాన్ని వీక్షించిన చిరు..
మెగా స్టార్ చిరంజీవి తాజాగా భీష్మ చిత్రాన్ని దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి వీక్షించాడు. ఇది తన జీవితంలో మరిచిపోలేని ఘటన అని, సినిమాల్లోకి రావాలనే స్ఫూర్తి నింపిన దేవుడితో కలిసి సినిమా చూస్తున్న ఈ రోజు కల నిజమైందని ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
Recommended Video
జాగ్రత్తలు పాటించండి..
చిరుతో కరచాలనం చేసిన ఫోటోలను షేర్ చేస్తూ... ఇక్కడ కరచాలనం చేసింది చేతులు శుభ్రంగా కడిగిన తరువాతే అంటూ అందరూ జాగ్రత్తలు పాటించండని సూచించాడు. కరోనా వ్యాప్తి చెందుకుండా ఉండేందుకు కరచాలనం చేయకండని ప్రభుత్వం సూచిస్తున్న సంగతి తెలిసిందే.