Just In
- 8 hrs ago
విభిన్న కథాంశంతో సమంత.. టాలీవుడ్కు మరో టాలెంటెడ్ డైరెక్టర్
- 8 hrs ago
Youtuber Shanmukh Jaswanth arrested: మద్యం మత్తులో కారు నడిపి.. ప్రమాదం
- 9 hrs ago
ట్రెండింగ్ : అలా కాలు జారి.. ఆ అవసరం లేకుండానే గర్భం దాల్చుతా.. రెండో పెళ్లిపై సురేఖా వాణి రియాక్షన్
- 10 hrs ago
అందుకే విడాకులు తీసుకొన్నా.. భర్తతో విభేదాలపై గుట్టువిప్పిన అమలాపాల్
Don't Miss!
- Lifestyle
ఆదివారం దినఫలాలు : ఓ రాశి వారికి ఆన్ లైన్ బిజినెస్ లో కలిసొస్తుంది...!
- News
అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కలకలం... సీసీటీవీ ఫుటేజీకి చిక్కిన ఆ ఇన్నోవా కారు...
- Finance
Sovereign gold bond: మార్చి 1 నుండి గోల్డ్ బాండ్స్, ధర ఎంతంటే
- Sports
India vs England: పూణేలోనే వన్డే సిరీస్.. ప్రేక్షకులకు మాత్రం నో ఎంట్రీ!!
- Automobiles
మీకు తెలుసా.. సిట్రోయెన్ షోరూమ్ ఇప్పుడు బెంగళూరులో
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చిరంజీవి కోసం బాలీవుడ్ ప్రముఖుడు: తెలుగులో ఇది మూడో సినిమా మాత్రమే!
రీఎంట్రీలో జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. రాజకీయాల కోసం తీసుకున్న గ్యాప్ను త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నారో ఏమో కానీ.. ఆయన వరుస పెట్టి ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తోన్న 'ఆచార్య'లో నటిస్తోన్న ఈ స్టార్ హీరో.. ఆ మూవీ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇది పట్టాలపై ఉండగానే.. మరిన్ని చిత్రాలను ప్రకటించారు. ఇందులో మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'లూసీఫర్' రీమేక్ ఒకటి. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
మలయాళంలో మోహన్లాల్ హీరోగా మరో స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన 'లూసీఫర్' సూపర్ హిట్ అయింది. దీన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు బుధవారమే జరిగాయి. ఇక, ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ రీమేక్ మూవీ కోసం బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో 'ధూమ్', 'ధూమ్2', 'రోబో 2.0', అజిత్ నటించిన 'బిల్లా' వంటి భారీ చిత్రాలకు ఆయన కెమెరామెన్గా పని చేశారు.

ఇక, తెలుగులో సిద్ధార్ద్ నటించిన 'లవ్ ఫెయిల్యూర్', 'సైజ్ జీరో' తర్వాత నీరవ్ షా చేస్తున్న మూడో చిత్రం 'లూసీఫర్' రీమేక్ మాత్రమే. ఆయన ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మలయాళంలో మోహన్ లాల్ను ఎంతో ఎలివేట్ చేసి చూపించారు. తెలుగులోనూ అదే ఫార్ములాను ఫాలో అయ్యేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అందుకే బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.