Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘శ్రీకారం’ సినిమాలో హైలైట్లు అదేనట: గతంలో ఎన్నడూ చూడని విధంగా శర్వానంద్
క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ రంగంలోకి ప్రవేశించాడు టాలెంటెడ్ గాయ్ శర్వానంద్. ఆ తర్వాత హీరోగా మారిన అతడు.. ఎన్నో చిత్రాల్లో అసాధారణమైన నటనతో ఆకట్టుకున్నాడు. తద్వారా కొన్ని విజయాలను సైతం అందుకున్నాడు. దీంతో అతడితో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ముందుకొస్తున్నారు. అందుకే జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం శర్వానంద్ 'శ్రీకారం' అనే సినిమాను చేశాడు. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. 'శ్రీకారం' మూవీలో క్లైమాక్స్ సీన్ హైలైట్గా ఉంటుందట. అంతేకాదు, ఆ సమయంలో హీరో శర్వానంద్ పెర్ఫార్మెన్స్ అదరగొడుతుందని టాక్. వ్యవసాయం గురించి ఇచ్చే మెసేజ్ మాత్రం గతంలో ఎన్నడూ చూడని విధంగా డిజైన్ చేశారని అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఊహించని మలుపుతో ఉంటుందని తెలిసింది. అలాగే, ప్రీ క్లైమాక్స్లో కూడా ఓ ట్విస్ట్ ఉంచారనే టాక్ వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో సాయి మాధవ్ బుర్రా అందించిన డైలాగ్స్ ఆలోచింపజేసేవిగా ఉంటాయని, ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తాయని తెలుస్తోంది.
శర్వానంద్ కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట దీన్ని నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్గా చేసింది. ఇక, ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 17 కోట్ల వరకూ వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. ఎన్నో అంచనాల నడుమ ఈ చిత్రం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే.