Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మళ్లీ కొత్త కథతో ముందుకు.. ‘కలర్ ఫోటో’ దర్శకుడు పోస్ట్ వైరల్
కలర్ ఫోటో సినిమాతో తెలుగు ఇండస్ట్రీని దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు దర్శకుడు సందీప్ రాజ్. సున్నితమైన భావోద్వేగాలు, స్వచ్చమైన ప్రేమ కథను అందంగా మలిచాడు సందీప్ రాజ్. సుహాస్, చాందినీ చౌదరి, సునీల్లను మెయిన్ లీడ్గా పెట్టి తీసిన కలర్ ఫోటో అందరినీ ఆకట్టుకుంటుంది. ఆహాలో విడుదలైన ఈ మూవీ లాక్డౌన్లో అందరి మనసులను గెలుచుకుంది. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీ పెద్దలను కలర్ ఫోటో తెగ ఆకట్టుకుంది.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఏకంగా తన ఆఫీస్కు పిలిపించుకుని మరీ అభినందించాడు. చిత్రయూనిట్తో ప్రత్యేకంగా ముచ్చటించిన బన్నీ.. సినిమాలోని ప్రతీ సీన్ గురించి చెప్పాడట. దర్శకుడు హీరో హీరోయిన్లకు తన తరుపున చిన్న బహుమతులను కూడా ఇచ్చాడు. అలా సందీప్ రాజ్ మొదటి సినిమాతోనే తన సత్తాను అందరికీ చూపించాడు. అయిత తాజాగా తన కొత్త సినిమా పనులను మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది.
తాజాగా ప్రొడ్యూసర్, మెగా అభిమాని అయినా ఎస్కేఎన్ (శ్రీనివాస కుమార్)తో కలిసి ఉన్న ఫోటోను సందీప్ షేర్ చేశాడు. రెండో ప్రాజెక్ట్ రెడీ అంటూ సందీప్ రాజ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అంతే కాకుండా స్క్రిప్ట్ మలిచిన తీరు అదిరిపోయిందంటూ నిర్మాత ఎస్కేఎన్ చేసిన కామెంట్ అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ సారి కూడా ప్రేమకథనే ఎంచుకున్నాడా? లేదా ట్రాక్ మార్చాడా? అన్నది చూడాలి.