Don't Miss!
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- News Telangana: బుధవారం నుంచే సమ్మర్ హాలీడేస్..
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
గుండెపోటుతో కమెడియన్ పొట్టి వీరయ్య కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం
టాలీవుడ్ మరోసారి విషాదంలో మునిగిపోయింది. గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమకు తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న కమెడియన్ పొట్టి వీరయ్య ఇకలేరు. గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Recommended Video
పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య. తెలంగాణలోని నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని ఫణిగిరిలో 1967లో జన్మించారు. పుట్టకతోనే మరుగుజ్గు అయిన వీరయ్య దక్షిణాది చిత్రసీమలో 500 చిత్రాలకుపైగా నటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కమెడియన్గా రాణించారు.
ప్రముఖ దర్శకుడు విఠలాచార్య రూపొందించిన అగ్గిదొర చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యారు. దర్శకరత్న దాసరి తెరకెక్కించిన చిత్రం తాతామనవడు చిత్రంతొ మంచి గుర్తింపు పొందారు.
ఇప్పటి వరకు అగ్గివీరుడు, తాతా మనవుడు, రాధమ్మ పెళ్లి, జగన్మోహిని, యుగంధర్, గజదొంగ, గొల నాగమ్మ, అత్తగారి పెత్తనం, టార్జన్ సుందరి లాంటి చిత్రాల్లో నటించారు.
చిన్నతనం నుంచి నాటకాలపై ఆసక్తి ఉన్న వీరయ్య నటుడు అవ్వాలనే కోరికతో మద్రాస్ వెళ్లారు. నటుడు శోభన్ బాబు సూచన మేరకు విఠలాచార్యను కలువగా ఆయన వేషం ఇవ్వడంతో నటుడిగా మారారు. అప్పటి నుంచి వెనుకకు చూసుకోలేదు.
వీరయ్య వ్యక్తిగత జీవితానికి వస్తే.. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్య మల్లిక 2008లో అనారోగ్యంతో మరణించారు.
సీఎం
కేసీఆర్
సంతాపం..
పొట్టి
వీరయ్య
మరణం
పట్ల
ముఖ్యమంత్రి
కె.
చంద్రశేఖర్
రావు
సంతాపం
వ్యక్తం
చేశారు.
విఠలాచార్య
కాలం
నుండి
నేటి
వరకు
పలు
భాషల్లోని
దాదాపు
500
సినిమాల్లో
నటించిన
వీరయ్య
తెలుగు
సినీ
ప్రేక్షకులను
తన
నటనతో
అమితంగా
అలరించారని
సీఎం
గుర్తు
చేసుకున్నారు.
వీరయ్య
కుటుంబ
సభ్యులకు
సీఎం
కెసిఆర్
తన
ప్రగాఢ
సానుభూతి
తెలిపారు.