Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
30 ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీకి కీలక పదవి.. ఏపీ ప్రభుత్వంలో..
టాప్ కమెడియన్, నటుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కీలక పదవిని చేపట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి. విద్యాధికుడైన పృథ్వీకి ముఖ్యమైన పదవిని అప్పగించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అడుగులేస్తున్నది. స్వర్గీయ ధర్మవరపు సుబ్రమణ్యం స్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈ విలక్షణ నటుడు ఆ పార్టీ కోసం హై రేంజ్లో ప్రచారం చేశారు. గత రెండేళ్లుగా మీడియాలో, సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ వైఎస్ జగన్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు సహకారం అందించిన సంగతి తెలిసిందే.
గతంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో ధర్మవరపు సుబ్రమణ్యం అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా సేవలందించారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆ కీలక పదవిని పృథ్వీకి ఇచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున ఎన్నికల ముందునే కాకుండా ఎన్నికల తర్వాత కూడా పృథ్వీ ప్రస్తుత ప్రభుత్వంపై ఈగ వాలకుండా కామెంట్లు చేస్తున్నాడు. వైఎస్ జగన్పై ఎలాంటి కామెంట్లు చేసినా తారాస్థాయిలో విరుచుకుపడుతున్నాడు. ఇటీవల వైఎస్ జగన్ విజయాన్ని తెలుగు చిత్ర సీమలో కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.