Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మెగా హీరోలతో నాగార్జున.. అంతా కలిసి ఫుల్ హల్చల్! నెట్టింట వైరల్ వీడియో
మెగాస్టార్ చిరంజీవి సహా మెగా హీరోలైన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లతో కలిసి తెగ హల్చల్ చేస్తూ కరోనా జాగ్రత్తలు చెప్పారు నాగార్జున. ఈ నలుగురికీ సంగీత దర్శకుడు కోటి కూడా తోడయ్యారు. అంతా కలిసి హల్చల్ చేస్తూ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి పోతే..
కరోనా విజృంభణ.. కదిలిన టాలీవుడ్ లోకం
ప్రపంచం అంత కరోనా సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా అని చెప్పలేం. మెల్లగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కోరలు చాస్తోంది కరోనా వైరస్. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ కరోనా పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ పలు సూచనలు చేస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ ప్రముఖులు సైతం ముందుకొచ్చి ప్రభుత్వానికి తమ వంతు సాయం చేస్తున్నారు.
చిరంజీవి సారథ్యంలో చారిటీ.. సినీ కార్మికులకు అండగా
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో 'కరోనా క్రైసిస్ చారిటీ' పేరిట ఓ సంస్థ ఏర్పాటు చేశారు. పలువురు నటీనటులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. ఈ చారిటీ ద్వారా విరాళాలు సేకరిస్తూ కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఎందరో టాలీవుడ్ ప్రముఖులు 'కరోనా క్రైసిస్ చారిటీ' కి తమ తమ విరాళాలు కూడా అందించి దాతృత్వం చాటుకున్నారు.
చిరుతో నాగ్.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో
ఇకపోతే కరోనా విజృంభణ నేపథ్యంలో ఏ మాత్రం భయపడాల్సిన పనిలేదని, ధైర్యంగా ఉండాలని పేర్కొంటూ ఓ వీడియో రూపొందించారు. ఇందులో సీనియర్ నటులు చిరంజీవి, నాగార్జునలతో పాటు యువ హీరోలు వరుణ్తేజ్, సాయి ధరమ్ తేజ్ అంతా కలిసి గొంతు కలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏదేమైనా కరోనాతో పోరాటం చేద్దాం.. అంటూ
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి స్వరపరిచి పాడిన ఈ పాటలో మన హీరోలు కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు చెప్పారు. ఏదేమైనా కరోనాతో పోరాటం చేద్దాం.. అంటూ చిరంజీవి వాయిస్ తో మొదలుపెట్టి ఆ తరువాత కోటి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఒక్కొక్కరుగా గొంతు కలిపారు. ఈ సాంగ్ చూసి.. కరోనాపై పోరాటానికి టాలీవుడ్ సెలబ్రిటీలు అందిస్తున్న సపోర్ట్ అభినందనీయం అంటున్నారు విశ్లేషకులు.