Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
టాలీవుడ్ తెరపై క్రికెటర్ డ్వేన్ బ్రావో.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో బిజీ బిజీగా!
ప్రపంచ ప్రఖ్యాత వెస్టిండీస్ క్రికెట్ ఆటగాడు డ్వేన్ బ్రావో తో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ అవేర్నేష్ ఫిల్మ్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కేవలం ఎంటర్ టైన్మెంట్ మూవీస్ మాత్రమే కాకుండా... అన్ని రకాల జోనర్స్ లో విభిన్న కథా చిత్రాలను అందించాలనేదే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఉద్దేశ్యం. అందులో భాగంగానే 'ఎం.ఎల్.ఎ, వైఫ్ ఆఫ్ రామ్, గూఢచారి, ఓ..బేబి...ఇలా వైవిధ్యమైన, విజయవంతమైన చిత్రాలు నిర్మించి అనతి కాలంలోనే అటు ఆడియన్స్ లో, ఇటు ఇండస్ట్రీలో అభిరుచి గల నిర్మాణ సంస్థగా మంచి గుర్తింపు ఏర్పరుచుకుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ - యువ సమ్రాట్ నాగ చైతన్యల క్రేజీ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ 'వెంకీ మామ' చిత్రాన్ని, అలాగే అనుష్క ప్రధాన పాత్రలో 'నిశ్శబ్దం' అనే ఇంటర్నేషనల్ మూవీని కూడా నిర్మిస్తుంది.
అయితే... కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా, సామాజిక స్పృహ కు సంబంధించిన విషయాలలో కూడా ప్రజలలో అవగాహన కల్పించాలనే సదుద్దేశ్యంతో సోషల్ అవేర్నెస్ ఫిల్మ్స్ ను నిర్మిస్తున్నారు సంస్థ నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల. ఈ నిర్మాణ సంస్థతో ఎ.ఎన్.టి ప్రొడక్షన్స్ సంస్థ కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా సోషల్ అవేర్నష్ ఫిల్మ్ ను నిర్మిస్తోంది.
'కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)' లో భాగంగా వెస్ట్ ఇండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావోతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ మూవీకి ఆర్తి శ్రీవాత్సవ దర్శకత్వం వహిస్తున్నారు. ఆమె దర్శకత్వం వహించిన ల్యాండ్ ఆఫ్ విడోస్ మరియు వైట్ నైట్ ఈ రెండు డాక్యుమెంటరీస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అవార్డులు గెలుచుకున్నాయి. ఇప్పుడు మహిళలకు శుభ్రత విషయంలో అవగాహన కల్పించేందుకు గాను ఈ సినిమాని నిర్మిస్తున్నారు. డ్వేన్ బ్రావో తన అధికారిక సోషల్ మీడియా ఖాతా అయినా ఫేస్బుక్ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.
ఈ చిత్ర విశేషాలను దర్శకురాలు ఆర్తి శ్రీవాత్సవ తెలియచేస్తూ...డ్వేన్ బ్రావోతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగాను, గర్వంగాను ఉంది. జులైలో తమిళనాడులో షూటింగ్ జరిగింది. దీంతో ఇండియలో షూటింగ్ పూర్తయ్యింది. ఆగష్టులో వెస్ట్ ఇండీస్ లోని ట్రినిడాడ్, టోబాగో లలో షూటింగ్ చేయనున్నాం అని చెప్పారు.
ఈ మూవీకి నిర్మాత - టి.జి.విశ్వప్రసాద్, కో - ప్రొడ్యూసర్ - వివేక్ కూచిభోట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - శ్రీ నటరాజ్, ప్రాజెక్ట్ డిజైన్ & ఎగ్జిక్యూషన్ - ఎ.ఎన్.టి ప్రొడక్షన్స్.