Don't Miss!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- News సీటు త్యాగం చేసిన ఆ ఎమ్మెల్యేకు జగన్ రాజ్యసభ హామీ-బహిరంగ ప్రకటన..!
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
దాసరి విగ్రహం తొలగింపుపై ఉద్రిక్తత.. దర్శకుల సంఘం ధర్నా, నిరసన
విశాఖపట్నం బీచ్ రోడ్లో విగ్రహాల తొలగింపు వ్యవహారం అత్యంత వివాదాస్పదంగా మారింది. ముందస్తు హెచ్చరికలు లేకుండా సినీ ప్రముఖులు దాసరి నారాయణ రావు, నందమూరి హరికృష్ణ విగ్రహాలను తొలగించడంపై అభిమానులు, ప్రజలు భగ్గుమంటున్నారు. విగ్రహాల తొలగింపుపై ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంఘం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇటీవల దాసరి, హరికృష్ణ విగ్రహాలను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ తొలగించిన సంగతి తెలిసిందే.
దాసరి, హరికృష్ణ విగ్రహాలను తొలగించడంపై ఉత్తరాంధ్ర సినీ దర్శకులు సంఘం తీవ్రంగా స్పందించింది. అర్ధరాత్రి విగ్రహాల తరలింపు అన్యాయం. ఒకవేళ అనుమతులు లేకపోతే విగ్రహాలు తొలగించే ముందు నోటీసులు జారీ చేయాలి. విగ్రహాలు పెట్టి ఆరునెలలైంది. అప్పటి నుంచి ఎలాంటి హెచ్చరికలు లేకుండా హఠాత్తుగా విగ్రహాలను తొలగించడం సమంజసం కాదు అని సంఘం అధ్యక్షుడు, దర్శకుడు యాదకుమార్ అన్నారు.
సినీ రంగానికి ఎంతో పేరు, ప్రఖ్యాతులు తెచ్చిన దర్శకుడు దాసరి నారాయణరావు విగ్రహం తొలగించడం తెలుగు కళా రంగాన్ని అవమానించడమేనని సంఘ కార్యదర్శి, దర్శకుడు కారెం వినయ్ ప్రకాష్ అన్నారు.
నాటక రంగ ప్రముఖుడు, రంగసాయి, నాటక సంఘం అధ్యక్షుడు బాదంగీర్ సాయి మాట్లాడుతూ...అత్యంత చిన్న స్థాయి నుంచి ఎంతో ఉన్నత స్థాయికి చేరుకొని, తెలుగు సినీ రంగంలో ఎంతో ఉన్నతమైన చిత్రాలు దర్శకత్వం వహించిన దాసరి గారి విగ్రహం తొలగించడం దారుణం. ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంఘంఆధ్వర్యంలో అన్ని అనుమతులతో త్వరలో నెలకొల్పుతాం అని అన్నారు.
ఈ నిరసన, ధర్నా కార్యక్రమంలో ఉత్తరాంధ్ర దర్శకులు రమేష్, శివశ్రీ, గీతాలయ ప్రసాద్, రాకేష్ రెడ్డి, లోలుగు రాజశేఖర్ లతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన సినీ, టీవీ నటీనటులు, దర్శకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.