Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
డెబ్యూ హీరోయిన్తో పూరి తనయుడు రొమాన్స్.. త్వరలోనే!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా రెండవ చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఆకాష్ పూరి కోసం ఈ చిత్రంలో డెబ్యూ హీరోయిన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మోడల్గా పాపులర్ అయిన యంగ్ బ్యూటీ గాయత్రీ భరద్వాజ్ని హీరోయిన్గా ఎంపిక చేశారు.
ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు అనిల్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నట్లు తెలుస్తోంది. తన తనయుడి కోసం ఈ సారి మాఫియా నేపథ్యంలో సాగే ప్రేమ కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆకాష్ పూరి హీరోగా నటించిన తొలి చిత్రం మెహబూబాని పూరి డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మెహబూబా చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దీనితో కొంత గ్యాప్ తీసుకుని ఈ సారి మంచి కథ సిద్ధం చేశారట. ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లని పరిచయం చేయడంతో పూరి ముందుంటారు. మోడల్గా పలు టైటిల్స్ సొంతం చేసుకున్న గాయత్రీ భరద్వాజ్ని ఈ ఎంపిక చేశారు. ఈ చిత్రంతో తన కొడుకుని హిట్ ఇవ్వాలని పూరి భావిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో తెలియనున్నాయి.