డెబ్యూ హీరోయిన్తో పూరి తనయుడు రొమాన్స్.. త్వరలోనే!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా రెండవ చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఆకాష్ పూరి కోసం ఈ చిత్రంలో డెబ్యూ హీరోయిన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మోడల్గా పాపులర్ అయిన యంగ్ బ్యూటీ గాయత్రీ భరద్వాజ్ని హీరోయిన్గా ఎంపిక చేశారు.
ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు అనిల్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నట్లు తెలుస్తోంది. తన తనయుడి కోసం ఈ సారి మాఫియా నేపథ్యంలో సాగే ప్రేమ కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆకాష్ పూరి హీరోగా నటించిన తొలి చిత్రం మెహబూబాని పూరి డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

మెహబూబా చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దీనితో కొంత గ్యాప్ తీసుకుని ఈ సారి మంచి కథ సిద్ధం చేశారట. ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లని పరిచయం చేయడంతో పూరి ముందుంటారు. మోడల్గా పలు టైటిల్స్ సొంతం చేసుకున్న గాయత్రీ భరద్వాజ్ని ఈ ఎంపిక చేశారు. ఈ చిత్రంతో తన కొడుకుని హిట్ ఇవ్వాలని పూరి భావిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











