Don't Miss!
- News మోదీ వలనే బంగారు రేటు పెరిగింది, ఐటీ అధికారులకు కళ్లు ఉన్నాయా, టీడీపీతో పొత్తు పెట్టుకుని ?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డెబ్యూ హీరోయిన్తో పూరి తనయుడు రొమాన్స్.. త్వరలోనే!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా రెండవ చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఆకాష్ పూరి కోసం ఈ చిత్రంలో డెబ్యూ హీరోయిన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మోడల్గా పాపులర్ అయిన యంగ్ బ్యూటీ గాయత్రీ భరద్వాజ్ని హీరోయిన్గా ఎంపిక చేశారు.
ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు అనిల్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నట్లు తెలుస్తోంది. తన తనయుడి కోసం ఈ సారి మాఫియా నేపథ్యంలో సాగే ప్రేమ కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆకాష్ పూరి హీరోగా నటించిన తొలి చిత్రం మెహబూబాని పూరి డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మెహబూబా చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దీనితో కొంత గ్యాప్ తీసుకుని ఈ సారి మంచి కథ సిద్ధం చేశారట. ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లని పరిచయం చేయడంతో పూరి ముందుంటారు. మోడల్గా పలు టైటిల్స్ సొంతం చేసుకున్న గాయత్రీ భరద్వాజ్ని ఈ ఎంపిక చేశారు. ఈ చిత్రంతో తన కొడుకుని హిట్ ఇవ్వాలని పూరి భావిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో తెలియనున్నాయి.