Don't Miss!
- News కడపలో వైఎస్ షర్మిలకు ప్లస్ గా వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ లేఖాస్త్రం!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఈ పరిస్థితిని చూస్తే బాధేస్తోంది.. యాక్షన్ తీసుకోకపోవడంపై కోపంగా ఉంది.. జేఎన్యూ ఘటనపై దీపికా
ఢిల్లీలోని జేఎన్యూ (జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ)లో హింసాత్మక ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ సెలెబ్రిటీలెందరో ఈ ఘటనను ఖండిస్తూ.. గాయపడిన విద్యార్థులకు సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తన తదుపరి చిత్రం చపాక్ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా డిల్లీ వెళ్లిన దీపికా పదుకొణె.. విద్యార్థులకు మద్దతు ప్రకటించింది.
ముసుగు వేసుకుని మూకదాడి..
యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్ధులపై.. ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ముసుగు ధరించి వచ్చిన కొంతమంది దుండగులు రాడ్లు, యాసిడ్, పదునైన ఆయుధాలతో విద్యార్థులు, టీచర్లపై దాడి చేస్తూ... దాదాపు రెండు గంటల పాటు యూనివర్సిటీ క్యాంపస్లో రణరంగం సృష్టించారు. ఈ దాడిలో జేఎన్యూ ఎస్యూ అధ్యక్షురాలు ఐషే ఘోష్ సహా మరో 30 మంది విద్యార్థులు, టీచర్లు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
విద్యార్థులకు అండగా..
ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న వేళ.. విద్యార్థులకు మద్దతు తెల్పుతూ దీపిక పదుకొణె జేఎన్యూకి వెళ్లింది. దుండగుడల దాడిలో గాయపడిన విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని పరామర్శించింది. దాడి జరిగిన తీరుపై.. వివరాలు అడిగి తెలుసుకుంది. అనంతరం విద్యార్థులు చేపట్టిన నిరసనలో పాల్గొని విద్యార్థులకు అండగా నిలబడింది.
బీజేపీ నేత ఫైర్
దీపికా పదుకొణె జేఎన్యూకు వెళ్లడంపై బీజేపీ నేత తజిందర్ బగ్గా మండిపడ్డాడు. దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామంటూ నినదించిన వారికి దీపికా మద్దతు తెలపడం దౌర్భాగ్యమని విమర్శించాడు. దీపికా పదుకొణె వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశాడు. జేఎన్యూ ఘటనపై దీపికా స్పందించిన తీరును నిరసిస్తూ నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఆమె నటించిన తాజా చిత్రం చపాక్ను నిషేధించాలంటూ ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో #BoycottChhapaak అనే హ్యాష్ ట్యాగ్ ట్విటర్లో టాప్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది.
చాలా బాధేస్తోంది..
‘ఈ ఘటన చాలా బాధను కలిగిస్తోంది. రెండేళ్ల పద్మావత్ సినిమా విషయంలోనూ ఇలాగే జరిగింది. అప్పుడు అదే చెప్పాను.. ఇప్పుడు అదే చెబుతున్నాను. ఇలాంటి దాడులు సర్వసాధారణం కాకూడదు. నాకు చాలా బాధతో పాటు భయంకూడా వేస్తోంది. మన దేశానికి ఇవి సరైనవి కావు. జరిగిన దానిపై ఇంకా ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంపై నాకు కోపం వస్తోంద'ని ఓ మీడియాతో చెప్పుకొచ్చింది.