Don't Miss!
- News కవిత అరెస్ట్ పై ఇంతకాలానికి కేసీఆర్ స్పందన వెనుక బిగ్ రీజన్
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
ధనుష్ మారి 2కు పెరుగుతున్న క్రేజ్.. థియేటర్లు పెంపు
రఘువరన్ బిటెక్ చిత్రంతో బంపర్ హిట్ కొట్టిన ధనుష్, ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన మారి 2 ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన సంగతి తెలిసిందే. ప్రతాప్ రాజు సమర్పణలో ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని ఐకన్ మూవీస్ అధినేత శ్రీరామ్ నైజాం, సీడెడ్, ఆంధ్రాలో రిలీజ్ చేశారు.
మారి 2 సినిమా విజయవంతంగా రన్ అవుతున్న సందర్భంగా నిర్మాత ధనుష్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ నెల 28 నుంచి థియేటర్లను పెంచుతున్నామని తెలిపారు.
ఆమె స్పీడ్ తట్టుకోవడం కష్టం.. దడదడలాడించింది.. ధనుష్
ఐకన్ మూవీస్ అధినేత శ్రీరామ్ మాట్లాడుతూ-మారి 2 తమిళం, తెలుగులో సైమల్టేనియస్గా రిలీజైంది. ఈ చిత్రం ఏ ఒక్క వర్గానికో కాకుండా అన్ని వర్గాలకు నచ్చింది. ఏ, బీ, సీ కేంద్రాల నుంచి స్పందన బావుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ అందరికీ నచ్చాయి అని అన్నారు.
కొన్ని సన్నివేశాల్లో కన్నీళ్లు పెట్టించేంతటి అద్భుత ప్రదర్శన చేసింది. ధనుష్ నటన పెద్ద ప్లస్ అయ్యింది. వాసుకి లాంటి బ్లాక్బస్టర్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాం. ఆ వెంటనే మరో విజయం అందుకోవడం ఆనందాన్నిచ్చింది. వచ్చే వారం నుంచి మరిన్ని థియేటర్లు పెంచుతున్నాం. ఈ క్రిస్మస్ బరిలో నాలుగు సినిమాలతో పోటీపడి రిలీజైన మా చిత్రం సంతృప్తికరమైన ఫలితాన్ని ఇచ్చింది అని అన్నారు.