Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలయ్య - బోయపాటి సినిమాకు కొత్త టైటిల్: పేరులోనే పవర్ ఉండేలా ప్లాన్
స్టార్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న ఆయన.. గతంలో తనకు రెండు భారీ విజయాలు 'సింహా', 'లెజెండ్' వంటి హిట్లను ఇచ్చిన దర్శకుడితో కలవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా గురించి తరచూ ఏదో ఒక ఆసక్తికరమైన వార్త తెరపైకి వస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ మూవీ టైటిల్ గురించి తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాకు 'మోనార్క్' అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ టైటిల్ విషయంలో చిత్ర యూనిట్ యూటర్న్ తీసుకుందట. ఇందులో భాగంగానే దీనికి 'ధర్మ' అనే పవర్ఫుల్ టైటిల్ను పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ టైటిల్ను నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించాడని తెలుస్తోంది. అంతేకాదు, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా అతి త్వరలోనే రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.
రెండు భారీ హిట్ల తర్వాత వస్తోన్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా చేస్తుండగా.. సామ్నా ఖాసీం అలియాస్ పూర్ణ మరో లీడ్గా చేస్తోంది. ఇక, ఇందులో నందమూరి బాలకృష్ణ అఘోరా పాత్రలో నటిస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, పవర్ఫుల్ రైతు పాత్రలోనూ ఆయన కనిపించనున్నాడు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మే 28న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.