Don't Miss!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
భూమి మీద రెండు తప్పులా? ఇంట్రస్టింగ్గా దిక్సూచి ట్రైలర్
దిలీప్కుమార్ సల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "దిక్సూచి". డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రన్ని శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు. బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పణలో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగాదర్శకుడు క్రాంతి మాధవ్ మాట్లాడుతూ.. దిలీప్ ఈ చిత్రాన్ని అన్నీ తానే అద్బుతంగా తీశాడు. తనకు అన్నీ క్రాప్ట్స్ మీద అవగాహన ఉంది. నిర్మాత రాజు గారి ఎంకరేజ్ మెంట్తో తాను పర్ఫెక్ట్ మూవీ చేశాడనిపించింది. కళ అంటే గౌరవం ఉంటేనె ఈ తరహా సినిమాలు వస్తాయి. సినిమానే ప్రాణంగా చెసారు. ట్రైలర్ లో అది కన్పించింది. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ అన్నారు.
సుధాకర్ మాట్లాడుతూ.. నిర్మాతకు టెస్ట్ ఉంటెనె మనం మంచి సినిమాలు చెయగలరు. ట్రైలర్ చూస్తే అద్బుతం అనే అందరు ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ఈ చిత్రానికి మంచి పబ్లిసిటీ తో పాటు ,థియేటర్స్ కూడా బాగా దొరకాలి. టీమ్ వర్క్ ను అందరు ఎంకరేజ్ చెయాలి. సిజి వర్క్, క్వాలిటీ విషయంలొ కాంప్రమైజ్ కాకుండా దిలీప్ చేసాడు. తను నటుడుగా, టెక్నిషియన్ గా మంచి గుర్తింపును సాధించాలన్నారు.
చత్రపతి శేఖర్ మాట్లాడుతూ .. దిలీప్ సినిమా దర్శకుడు అనగానే ఫస్ట్ డౌట్ పడ్డాను. బట్ అతని డిజైనింగ్ , ప్రీ ప్లాన్ అంతా సూబర్బ్. సినిమా ఔట్ పుట్ చూస్తే అందరు స్టన్ అవ్వటం గ్యారెంటీ అన్నారు.
కేజీఎఫ్ హీరో హత్యకు కుట్ర.. భారీగా సుపారీ! కన్నడలో అరెస్టులు.. హీరో యష్ క్లారిటీ
బిత్తిరీ సత్తి మాట్లాడుతూ.. అందరం కష్టపడి పైకి వచ్చిన మనుషులం కలిసి ఈ సినిమా చేశాము. దిలీప్ సినిమా కొసం ఎంత కష్టపడ్డాడొ. రిలీజ్కు కూడా అదే కష్టం. తను సక్సెస్ అవ్వటం మాత్రం పక్కా. తను కూడా 25సంవత్సరాల అనుభవం ఉన్న యాక్టర్. నిర్మాతలు మరిన్ని మంచి చిత్రాలు తీయాలన్నారు.
సమ్మెట గాంథీ మాట్లాడుతూ.. నేను రాజు పాత్రలో నటించాను. దిలీప్ ఆల్ రౌండర్. తాను గొప్ప స్దాయికి ఎదగుతాడన్నారు.హీరొయిన్ చాందినీ మాట్లాడుతూ.. ట్రైలర్ చూస్తే దిలీప్ కష్టం ఎంటనేది తెలుస్తుంది. చిన్నగా ప్రారంభం చెసినా చాలా గ్రాండ్ గా పూర్తి చేశాము. నాకు అవకాశం రావటం నా అదృష్టమన్నారు.
హీరో కమ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ సల్వాది మాట్లాడుతూ... నిర్మాత రాజు గారు గురించి నేను ముఖ్యంగా చెప్పాలి. నన్ను నమ్మి డబ్బులు పెట్టారు. దిక్సూచి ఓ కొత్త జొనర్ లొ వస్తొన్న సినిమా. ఫ్యామిలీ అంతా వెళ్ళి చూసే చిత్రమిది. 1970 బ్యాక్డ్రాప్లో స్టోరీ .సెమీ పీరియాడిక్ ఫిల్మ్. చాలా నీట్గా థ్రిల్లింగ్, డివోషనల్ అంశాలతో ఉంటుంది. అందరు నటీనటులు సపోర్ట్ చేశారు, అంతే అద్బుతంగా నటించారు. సినిమా బాగుంటే థియేటర్స్ ప్రాబ్లం ఉండదని నేను నమ్ముతాను. 2019 లొ ది బెస్ట్ మూవీ గా దిక్సూచి ఉంటుందని మా టీమ్ కాన్పిడెంట్ గా ఉన్నామన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సుమన్, అరుణ్ భరత్, నిహారిక తదితరులు పాల్గొన్నారు.దిలీప్కుమార్ సల్వాది, చత్రపతి శేఖర్, సమ్మెట గాంధీ, చాందిని, సమీరా, స్వప్నిక, బిత్తిరి సత్తి , రాకేష్ , మల్లాది భాస్కర్ , సుమన్, రజితసాగర్, అరుణ్బాబు, ధన్వి నటించారు. ప్రొడ్యూసర్స్: నర్సింహరాజు రాచూరి, శైలజా సముద్రాల, కెమెరా: జయకృష్ణ, రవికొమ్మి, మ్యూజిక్ డైరెక్టర్: పద్మనాభ్ భరద్వాజ్, లిరిక్స్: శ్రీరామ్ తపస్వీ, స్టోరీ, స్ర్కీన్ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: దిలీప్కుమార్ సల్వాది కట్స్: దిక్సూచి స్టూడియోస్