Don't Miss!
- Finance Just Dial Stock: జస్ట్ డయల్ స్టాక్ రికార్డుల మోత.. ఇంట్రాడేలో 13 శాతం అప్.. అదే కారణం..
- News సీఎం జగన్ యాత్ర పై నిఘా - కీలక నిర్ణయాలు..!!
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
పింక్ రీమేక్ అప్డేట్ : పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్.. దిల్ రాజు ప్రకటన
టాలీవుడ్లో స్ట్రాటజీలు ప్లే చేయడంలో, ఎలాంటి కథలు హిట్ అవుతాయి?, ఏ సీజన్లో ఎలాంటి సినిమాను విడుదల చేయాలని ఇలాంటి వాటిలో ఆరితేరిన నిర్మాత దిల్ రాజు. నిర్మాతగా ఓ వైపు బిజీగానే ఉంటూ డిస్ట్రిబ్యూటర్గానూ ఆదాయ మార్గాలు సమకూర్చుకుంటూ సేఫ్ జోన్లో ఉంటాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే దిల్ రాజుకు బాగానే కలిసి వచ్చినట్టు తెలుస్తోంది.
అల, సరిలేరుతో..
అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో దిల్ రాజు పంట పండినట్టు తెలుస్తోంది. ఈ రెండు చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసింది ఆయనే. ఈ రెండు చిత్ర యూనిట్స్ కలెక్షన్ల పేరిట పోస్టర్ల యుద్దానికి దిగినా.. అందరి కంటే ఎక్కువ సొమ్ము చేసుకుంది దిల్ రాజే అని టాక్. ఈ సినిమాలతో దిల్ రాజుకు బాగానే గిట్టుబాటైందని ఇన్ సైడ్ టాక్.
తాజాగా జానుతో..
జాను చిత్రాన్ని కూడా లిమిటెడ్ బడ్జెట్తో, పరిమిత వనరులతో అత్యద్భుతంగా నిర్మించాడు. ఈ సినిమా విడుదలై మంచి టాక్ను సొంతం చేసుకుంది. మ్యాజిక్ రీ క్రియేట్ అయిందంటూ సోషల్ మీడియాలో చిత్రయూనిట్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న జాను టీమ్..
జాను చిత్రం ఇంత మంచి టాక్ను సొంతం చేసుకోవడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకుంది యూనిట్. సమంత, దిల్ రాజు, శర్వానంద్ కాలినడకన వెళ్లి.. శ్రీ వేంకటేశ్వరుని దర్శనం చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు చిత్రాల అప్డేట్స్ను ప్రకటించాడు.
జోష్లో ఉన్న దిల్ రాజు..
జాను మూవీ సక్సెస్లో ఉన్న దిల్ రాజు.. తన ప్రొడక్షన్ హౌస్లో రాబోతోన్న కొన్ని చిత్రాల అప్డేట్స్ను ప్రకటించాడు. పవన్కల్యాణ్ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందని, మార్చి నెలలో ఫస్ట్లుక్ను, మే నెలలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని తెలిపారు. అలాగే ఇంద్రగంటి మోహన్కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్బాబు కలిసి నటిస్తున్న `వి` చిత్రాన్ని ఉగాది సందర్భంగా మార్చి 25న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.