Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వెంకటేష్ వచ్చాడు.. ఇక మెగా వారసుడికి తిరుగేలేదు: దిల్ రాజు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా 'వాల్మీకి'. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ' సినిమాకి రీమేక్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్రంలో వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. తమిళ నటుడు అథర్వా మురళి విలన్గా కనిపించనున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. సెప్టెంబర్ 20వ తేదీన 'వాల్మీకి' విడుదల కానున్న నేపథ్యంలో నిన్న (ఆదివారం) చిత్ర ప్రీ రిలీజ్ వేడుక అత్యంత ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విక్టరీ వెంకటేష్ హాజరై సందడి చేశారు. ఈయనతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు సైతం విచ్చేసి వాల్మీకి సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
టాలీవుడ్ హిట్ చీరాల నిర్మాతగా పేరొందిన దిల్ రాజు వేదికపై ఆసక్తికరంగా మాట్లాడారు. ''మా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్తో గబ్బర్సింగ్, సాయిధరమ్ తేజ్తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అల్లు అర్జున్తో దువ్వాడ జగన్నాథం సినిమాలు చేసి ఇప్పుడు వరుణ్ తేజ్తో 'వాల్మీకి'తో సూపర్ హిట్ కొట్టబోతున్నాడు. వెంకటేష్ గారు ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా విచ్చేశారు కాబట్టి 'ఎఫ్2'లా ఈ సినిమాకు కూడా తిరుగులేదు. ఫ్యాషనేట్గా సినిమాలు తీయాలనే ఫ్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్ వీళ్ళు. తప్పకుండా 'వాల్మీకి' పెద్ద హిట్ అవుతుంది'' అని అన్నారు.