దిల్ రాజు కోసం ఎన్టీఆర్, ప్రభాస్.. పూర్తిగా వాళ్ళ మీదే ఆధారపడి, నో ప్రమోషన్స్.. ఎందుకంటే?
అగ్ర నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ ను ''రౌడీ బాయ్స్'' సినిమాతో హీరోగా లాంచ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పెద్ద సినిమాల నిష్క్రమణతో సంక్రాంతికి రంగంలోకి దిగడానికి సిద్ధం అయింది. అయితే ఈ సినిమా ఆఫ్ లైన్ ప్రమోషన్ విషయంలో దిల్ రాజు వెనక్కి తగ్గాడు. ఆ వివరాల్లోకి వెళితే..

రంగంలోకి
RRR, రాధే శ్యామ్, వలిమై వంటి పాన్ ఇండియా సినిమాలు సంక్రాంతికి రావాల్సి ఉండగా పరిస్థితుల ప్రభావం వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు 'బంగార్రాజు' 'డీజే టిల్లు' 'హీరో' 'సూపర్ మచ్చీ' 'రౌడీ బాయ్స్' వంటి సినిమాలు రేసులోకి వచ్చి చేరాయి. అయితే హీరో, బంగార్రాజు లాంటి కాస్త పేరున్న సినిమాలకు బాగానే ప్రమోషన్స్ చేస్తున్నా ఈ రౌడీ బాయ్స్ విషయంలో ఇంకా దిల్ రాజు పూర్తిగా రంగంలోకి దిగలేదు.

సంక్రాంతికి దింపాలని
హుషారు' ఫేమ్ శ్రీహర్ష దర్శకత్వంలో తెరకెక్కిన రౌడీ బాయ్స్ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నిజానికి ఈ సంక్రాంతి సీజన్ లో సినిమా రిలీజ్ చేస్తున్నట్లు దిల్ రాజు ముందు ప్రకటించలేదు. కరోనా సహా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దెబ్బకు థియేటర్లు మూత పడడంతో టాలీవుడ్ సంక్రాంతి సినిమాల విడుదల షెడ్యూల్ పూర్తిగా మారిపోవడంతో.. అప్పటికప్పుడు సంక్రాంతికి దింపాలని ఫిక్స్ అయ్యారు,

గట్టిగా ప్లాన్
'రౌడీ బాయ్స్' సినిమాతో ఆశిష్ అరంగేట్రం కోసం దిల్ రాజు గట్టిగా ప్లాన్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో సినిమాటోగ్రాఫర్ మధీ, - ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ వంటి ప్రముఖ సాంకేతిక నిపుణులను ఈ సినిమా కోసం లైన్ లో పెట్టారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఇప్పటికీ దిల్ రాజు ఆఫ్ లైన్ ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సైలెంట్ గా
సంక్రాంతి బరిలో నిలిచిన 'బంగార్రాజు' విడుదల తేదీ ప్రకటించడానికి ఓ ఈవెంట్ చేశారు. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న 'హీరో' సినిమాకు సంబంధించిన విడుదల తేదీ ప్రకటన ఈవెంట్ కూడా జరిగింది. కానీ 'రౌడీ బాయ్స్' సినిమా కు సంబంధించి ఎలాంటి ఈవెంట్ జరగలేదు. నిజానికి 'రౌడీ బాయ్స్' సినిమా ఫస్ట్ లుక్ - మోషన్ పోస్టర్ - ఫస్ట్ సాంగ్ లను విజయ్ దేవరకొండ - సుకుమార్ వంటి సినీ ప్రముఖులతో గ్రాండ్ గా లాంచ్ చేసి ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాడని అనుకుంటున్నారు.
Recommended Video

సోషల్ మీడియా ప్రచారానికే
కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పబ్లిక్ ఈవెంట్స్ చేయడం కరెక్ట్ కాదని దిల్ రాజు సోషల్ మీడియా ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు అని తెలుస్తోంది. ఎన్టీఆర్ తో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ మాత్రమే కాక తన చేతిలో ఉన్న మరికొందరు హీరోలతో ఆన్ లైన్ ప్రమోషన్స్ చేయిస్తున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











