Don't Miss!
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ..? తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ సినిమాపై దిల్ రాజు అసంతృప్తి.. రషెస్ చూసి రీషూట్ చేయాలని చెప్పేశాడట.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకరు. మొదట్లో డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించడం వల్ల ఈయనకు సినిమాల పట్ల పూర్తి అవగాహన ఉంటుంది. అందుకే ప్రతి సినిమానూ చక్కగా జడ్జ్మెంట్ చేయగలరు. ఈ కారణంగానే ఆయన స్టార్ ప్రొడ్యూసర్గా ఎదిగిపోయారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఎన్నో సినిమాలు నిర్మితమవుతున్నాయి. వాటిలో బడా చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. ఆయన ఓ సినిమా విషయంలో అసంతృప్తితో ఉన్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా సినిమా? వివరాల్లోకి వెళితే...
సంక్రాంతి సినిమాలు రెండూ ఆయనవే
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న రెండు భారీ సినిమాల్లో దిల్ రాజు భాగస్వామి అయ్యారు. మహేశ్ - అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు'కు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆయన.. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ మూవీ ‘అల.. వైకుంఠపురములో' నైజాం ఏరియా రైట్స్ను దక్కించుకున్నారు. ఈ రెండు సినిమాలు ఒకరోజు గ్యాప్లో రానున్నాయి.
హిట్తో ప్రారంభమై ఫ్లాప్తో ముగిసింది
దిల్ రాజు బ్యానర్లో ఈ ఏడాది మూడు సినిమాలు విడుదల అయ్యాయి. వాటిలో వరుణ్ తేజ్, వెంకటేష్ కలిసి నటించిన ‘F2', మహేశ్ - వంశీ పైడిపల్లి కాంబోలో వచ్చిన ‘మహర్షి' సూపర్ హిట్ అయ్యాయి. అలాగే, ఇటీవల విడుదలైన రాజ్ తరుణ్ - షాలినీ పాండే నటించిన ‘ఇద్దరి లోకం ఒకటే' మాత్రం ఫ్లాప్ అయింది. అంటే ఈ ఏడాది హిట్తో ప్రారంభమై ఫ్లాప్తో ముగిసింది.
దర్శకుడిని హీరోగా మార్చేశాడు
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్గా వెలుగొందుతున్న దిల్ రాజు.. మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ను హీరోగా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ‘సీనయ్య' అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను నరసింహా రూపొందిస్తున్నాడు. ఇందులో వినాయక్ సరసన శ్రేయ నటిస్తోంది. ఈ సినిమా కోసం ఆయన ఎంతో స్లిమ్ అవడంతో పాటు లుక్ను పూర్తిగా మార్చేశారు.
తండ్రి, కూతురు సెంటిమెంట్తో
‘సీనయ్య' సినిమా తండ్రి, కూతురు సెంటిమెంట్తో తెరకెక్కుతోందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో వినాయక్.. ఓ అమ్మాయికి తండ్రిగా నటిస్తున్నాడట. ఆమెను కొందరు వ్యక్తులు అత్యాచారం చేస్తారని, వాళ్లపై పగ తీర్చుకునే పాత్రలో వినాయక్ నటిస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా సోషల్ మెసేజ్తో కూడి ఉంటుందని అంటున్నారు.
ఆ సినిమాపై దిల్ రాజు అసంతృప్తి
ఇటీవల చిత్ర నిర్మాత దిల్ రాజు రషెస్ చూశారని తెలిసింది. వాటిని చూసిన తర్వాత ఆయన అసంతృప్తిగా ఉన్నారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అంతేకాదు, అందులోని కొన్ని సన్నివేశాలు రీషూట్ చేయాలని వెంటనే దర్శకుడు నరసింహాకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన ఆ సీన్స్ అన్నింటినీ మరోసారి చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్.